Summer vacation: వేసవి విహారం అదరహో
వేసవిలో ఎండలు మండుతాయి కాబట్టి, పిల్లలకు సెలవులిస్తారు. సహజంగానే బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లేందుకు, పుణ్యక్షేత్రాలకు పర్యటనలు ఈ సమయంలో చేస్తారు. దీంతోపాటు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు దేశీయులు ఈ వేసవిలో శీతల ప్రాంతాలకు.. ముఖ్యంగా హిల్ స్టేషన్లకు తరలి వెళ్లడం గణనీయంగా పెరిగింది.
2023తో పోలిస్తే 40 శాతం వృద్ధి
ఆతిథ్య, ప్రయాణ సేవల సంస్థలకు గిరాకీ
దిల్లీ: వేసవిలో ఎండలు మండుతాయి కాబట్టి, పిల్లలకు సెలవులిస్తారు. సహజంగానే బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లేందుకు, పుణ్యక్షేత్రాలకు పర్యటనలు ఈ సమయంలో చేస్తారు. దీంతోపాటు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు దేశీయులు ఈ వేసవిలో శీతల ప్రాంతాలకు.. ముఖ్యంగా హిల్ స్టేషన్లకు తరలి వెళ్లడం గణనీయంగా పెరిగింది. గత ఏడాది వేసవితో పోలిస్తే ఈసారి వేసవి ప్రయాణాలు 40% పెరిగాయి. దీంతో ఆతిథ్య, ప్రయాణ సేవల సంస్థలకు బలమైన గిరాకీ లభించింది. దీంతోపాటు పార్లమెంట్, కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలూ జరుగుతున్నందున.. నాయకులు-సంబంధితుల ప్రయాణాలూ పెరిగాయి. ఈ ప్రభావం కార్పొరేట్ సమావేశాలు, ప్రదర్శనల వ్యాపారంపై కొంత మేర పడింది. అయితే రాజకీయ పర్యటనల వల్ల హోటళ్లలో రిటైల్ వ్యాపారానికి గిరాకీ పెరిగింది.
- ‘ఉత్తరాది వారు ఎండ వేడిని తప్పించుకునేందుకు ఎత్తైన ప్రదేశాల్లో ఉండే వేసవి విడిదికి వెళ్లేందుకు మొగ్గు చూపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వేసవి ప్రయాణాలు 30-40 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయ’ని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, ర్యాడిసన్ హోటల్ గ్రూప్ ఛైర్మన్-దక్షిణాసియా కేబీ కఛ్రూ వెల్లడించారు.
- మేక్మైట్రిప్ వేసవి ప్రయాణి ధోరణి గమనిస్తే, కుటుంబ ప్రయాణాల విభాగం 2023తో పోలిస్తే ఈసారి 20% వృద్ధిని నమోదు చేసింది. ఒంటరి ప్రయాణాలు కూడా 10% అధికమయ్యాయని మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ రాజేశ్ మ్యాగో వెల్లడించారు.
- ‘కార్పొరేట్ సంస్థల నుంచి లభించే వ్యాపారంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం కొంతమేర పడినా, రిటైల్ వ్యాపారం 20% వృద్ధి నమోదు చేసింద’ని రాయల్ ఆర్కిడ్ హోటల్స్ లిమిటెడ్ సీఎండీ చందర్ కె.బాల్జీ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లోని పర్వత ప్రాంతాలపై హోటళ్లు, రిసార్టులు, ఇతర లీజర్ గమ్యస్థానాలు అధిక ప్రయోజనం పొందాయని పేర్కొన్నారు. మషోబ్రా (హిమాచల్ప్రదేశ్) రిటైల్ వ్యాపారం అయిందింతలు పెరిగిందని తెలిపారు. ముస్సోరి రిటైల్ ఆక్యుపెన్సీ రెండింతలు, గోవా 50% వృద్ధి నమోదు చేశాయని తెలిపారు.
- ఆతిథ్య, ట్రావెల్-టెక్ సంస్థ ఓయో ప్రకారం.. 2024 మే, జూన్ బుకింగ్లలో బీచ్ గమ్యస్థానాలకు ప్రయాణికులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం లీజర్ బుకింగ్లలో 53% బీచ్ బుకింగ్లు ఉంటున్నాయని పేర్కొంది. అత్యధికులు సందర్శిస్తున్న బీచ్ గమ్యస్థానంగా గోవా ఉందని తెలిపింది. దీని తర్వాత వర్కాలా, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్పై ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించింది. నైనిటాల్, రిషికేశ్, మనాలీ, ముస్సోరి, డార్జిలింగ్ వంటి పర్వత ప్రాంతాలకు వెళ్లేందుకు యాత్రికులు మొగ్గు చూపుతున్నారు.
ఎక్కువ మంది విహార యాత్రలకు ఎంపిక చేసుకున్న ప్రాంతాలు: హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, గోవా, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం