Tata Motors: టాటా మోటార్స్ నికర లాభం రూ.3,783 కోట్లు
Tata Motors: సెమీకండక్టర్ల సరఫరా క్రమంగా మెరుగవుతున్న నేపథ్యంలో కంపెనీ తయారీ, విక్రయాలు పుంజుకుంటున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే బలమైన ఫలితాలను నమోదు చేసినట్లు వివరించింది.
దిల్లీ: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల (Tata Motors Q2 Results)ను గురువారం ప్రకటించింది. సమీక్షా త్రైమాసికంలో రూ.3,783 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.1,004 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.79,611 కోట్ల నుంచి రూ.1,05,128 కోట్లకు పెరిగింది.
టాటా మోటార్స్ (Tata Motors) ప్రయాణికుల వాహన విక్రయాలు సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల వ్యవధిలో వార్షిక ప్రాతిపదికన 2.4 శాతం పడిపోయి 1.39 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో వాణిజ్య వాహన అమ్మకాలు 3.5 శాతం పెరిగి 1.04 లక్షల యూనిట్లకు చేరాయి. కంపెనీ అనుబంధ జాగ్వార్ ల్యాండ్రోవర్ విక్రయాలు 29 శాతం పెరిగి 96,817 యూనిట్లకు చేరాయి. సెమీకండక్టర్ల సరఫరా క్రమంగా మెరుగవుతున్న నేపథ్యంలోనే కంపెనీ తయారీ, విక్రయాలు పుంజుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలోనూ కంపెనీ బలమైన ఫలితాలను నమోదు చేస్తుందని పేర్కొంది. జేఎల్ఆర్ వద్ద బలమైన ఆర్డర్ బుక్ ఉందని.. హెవీ ట్రక్కులకు గిరాకీ పుంజుకుంటోందని తెలిపింది. అలాగే ప్రయాణికుల వాహన విభాగంలో కొత్త కార్లకు ఆదరణ పెరుగుతోందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం