Crisil: ఇళ్లకు డిమాండ్.. సిమెంట్కు అదే హుషార్
సమీప భవిష్యత్తులో మన దేశంలో సిమెంట్ తలసరి వినియోగం గణనీయంగా పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుతం మనదేశంలో తలసరి సిమెంటు వినియోగం 240- 250 కిలోలుగా ఉంది.
తయారీ సామర్థ్యం పెంపునకు కంపెనీల సన్నాహాలు
ఈనాడు - హైదరాబాద్
సమీప భవిష్యత్తులో మన దేశంలో సిమెంట్ తలసరి వినియోగం గణనీయంగా పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుతం మనదేశంలో తలసరి సిమెంటు వినియోగం 240- 250 కిలోలుగా ఉంది. ఇది ప్రపంచ సగటు కంటే ఎంతో తక్కువ. ప్రపంచ దేశాల సగటు 500-550 కిలోలుగా ఉంది. మనదేశంలో జనాభా 2050 నాటికి 166 కోట్లకు చేరుతుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల పట్టణాలు, నగరాల్లో ఇళ్లకు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే పట్టణాల్లో దాదాపు 2 కోట్ల ఇళ్ల కొరత ఉన్నట్లు అంచనా. 2030 నాటికి ఇది రెట్టింపు కావచ్చు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో సిమెంటు వినియోగం పెరుగుతుంది. 2025 వరకు సిమెంటుకు డిమాండ్ ఏటా 8- 9% పెరిగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ అంచనా వేసింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని, సిమెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, సామర్థ్యాన్ని అధికంగా వినియోగించుకోవడానికి సిమెంటు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సాగర్ సిమెంట్స్ కూడా ఇదే పంథాలో ముందుకెళ్తోంది. ఆంధ్రా సిమెంట్స్ను కొనుగోలు చేయడం వల్ల ఈ సంస్థకు 2.25 మిలియన్ టన్నుల సామర్థ్యం లభించింది. ఆంధ్రా సిమెంట్స్ యూనిట్లో ఆధునికీకరణ, విస్తరణ చేపట్టినట్లు సాగర్ సిమెంట్స్ పేర్కొంది. దీని కోసం రూ.470 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు సాగర్ సిమెంట్స్కు చెందిన మట్టంపల్లి యూనిట్తో పాటు ఆంధ్రా సిమెంట్స్కు చెందిన దాచేపల్లి యూనిట్లో విద్యుత్తు లోడర్లు, ఈవీ ట్రక్కులు వినియోగిస్తున్నట్లు పేర్కొంది.
2035కు 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి
సాగర్ సిమెంట్స్ లక్ష్యం
అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం
సాగర్ సిమెంట్స్ 2035 కల్లా 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ, దక్షిణాది రాష్ట్రాల్లో క్రియాశీలక సిమెంట్ కంపెనీల్లో ఒకటిగా ఉంది. కొంతకాలంగా తూర్పు, మధ్య భారతదేశ రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో సిమెంటు యూనిట్లు ఉన్నాయి. కొద్దికాలం క్రితమే సాగర్ సిమెంట్స్ 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సంస్థకు 10.5 మిలియన్ టన్నుల వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 2035 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనేది తమ లక్ష్యమని సాగర్ సిమెంట్స్ జాయింట్ ఎండీ ఎస్.శ్రీకాంత్రెడ్డి సంస్థ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.2,504 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) రూ.245 కోట్లు ఉంది. అదే సమయంలో రూ.52 కోట్ల నికర నష్టం నమోదైంది. తన ఉత్పత్తి సామర్థ్యంలో 53 శాతాన్ని సంస్థ వినియోగించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు