Sebi: డెరివేటివ్స్లో స్థానం.. కంపెనీలకు ఇకపై కష్టమే
స్టాక్మార్కెట్లోని డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్- ఎఫ్అండ్ఓ) విభాగంలో ట్రేడ్ అయ్యే కంపెనీల జాబితాలోకి కొత్త కంపెనీల ప్రవేశం ఇకపై కష్టంగా మారనుంది. దీనికి సంబంధించి నియమ నిబంధనలను కఠినతరం చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది.
అర్హత నిబంధనలు కఠినతరం చేయనున్న సెబీ
చర్చాపత్రం విడుదల
సాధారణ మదుపరులకు రక్షణ కల్పించటమే లక్ష్యం
దిల్లీ: స్టాక్మార్కెట్లోని డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్- ఎఫ్అండ్ఓ) విభాగంలో ట్రేడ్ అయ్యే కంపెనీల జాబితాలోకి కొత్త కంపెనీల ప్రవేశం ఇకపై కష్టంగా మారనుంది. దీనికి సంబంధించి నియమ నిబంధనలను కఠినతరం చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. అంతగా సత్తా లేని చిన్నా, చితకా కంపెనీలను డెరివేటివ్స్ జాబితా నుంచి తొలగించే అవకాశం ఇందువల్ల ఏర్పడనుంది. నగదు విభాగంలో ట్రేడింగ్ వాల్యూమ్ అధికంగా నమోదయ్యే కంపెనీలే ఎఫ్అండ్ఓ విభాగంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తారు. ‘మార్కెట్ హెచ్చుతగ్గులు, మోసపూరిత ఆలోచనలు ఉన్న వ్యక్తుల చర్యల వల్ల సాధారణ మదుపరులు డెరవేటివ్స్ విభాగంలో నష్టాల పాలయ్యే ప్రమాదం ఉంది. వారికి తగినంత రక్షణ కల్పించడం తప్పనిసరి’ అని సెబీ ఈ సందర్భంగా వివరించింది. అత్యంత నాణ్యమైన కంపెనీల షేర్లను, వాటిలో నమోదయ్యే ట్రేడింగ్ పరిమాణం, ఇతర అంశాల ఆధారంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. దీనికి తగ్గట్లుగా డెరివేటివ్స్ విభాగంలో మార్పులు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.
ప్రస్తుత నిబంధనలు 2018 నుంచి..
డెరివేటివ్స్ విభాగంలో స్థానం పొందేందుకు కంపెనీలకు అర్హత, సంబంధిత విధివిధానాలను 2018లో నిర్దేశించారు. ఆ తర్వాత వీటిని సమీక్షించలేదు. గత కొన్నేళ్లలో నగదు విభాగంలో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ వాల్యూమ్ గణనీయంగా పెరిగింది. సంస్థాగత మదుపరులకు తోడు, సాధారణ మదుపరులు సైతం ఎఫ్అండ్ఓలో అధికంగా ట్రేడ్ చేస్తున్నారు. తగిన అవగాహన లేకుండానే ట్రేడింగ్ చేసి నష్టపోతున్న మదుపరుల సంఖ్య భారీగా పెరిగినందునే, నిబంధనలను కట్టుదిట్టం చేయాలని సెబీ సంకల్పించింది.
మార్పులు ఇలా
సెబీ ప్రతిపాదనల ప్రకారం, డెరివేటివ్స్ విభాగంలోకి ఏదైనా కంపెనీని చేర్చాలంటే, ట్రేడింగ్ జరిగే మొత్తం రోజుల్లో కనీసం 75% రోజుల పాటు సంబంధిత కంపెనీ షేర్లలో ట్రేడింగ్ నమోదు కావాలి. కనీసం 200 మంది ట్రేడర్లు కానీ, స్టాక్మార్కెట్లో చురుకుగా షేర్ల క్రయవిక్రయాలు సాగించే ట్రేడర్లలో కనీసం 15% మంది కానీ... సంబంధిత షేరులో క్రయవిక్రయాలు సాగించాలి. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే, దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. రోజువారీ ట్రేడింగ్ విలువ రూ.500-1500 కోట్ల మధ్య ఉండాలి. రోజు వారీ డెరివేటివ్స్ ప్రీమియమ్ టర్నోవర్ కనీసం రూ.150 కోట్లు ఉండాలి. ఈ నిబంధనలతో సరితూగిన కంపెనీలకే, డెరివేటివ్స్ విభాగంలో అడుగు పెట్టే అవకాశం ఏర్పడుతంది.
ఓపెన్ కాంట్రాక్టులకూ
ఓపెన్ కాంట్రాక్టులకూ గరిష్ఠ పరిమితిని సెబీ నిర్దేశించింది. ప్రస్తుతం ఓపెన్ కాంట్రాక్టుల విలువ రూ.500 కోట్లు కాగా, దీనిని రూ. 1250 కోట్లు, రూ.1750 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. తగినంత ట్రేడింగ్ టర్నోవర్, ఓపెన్ ఇంట్రస్ట్, ఎక్కువ మంది భాగస్వామ్యం... ప్రధాన లక్ష్యాలుగా ఈ నిబంధనలను సెబీ ప్రతిపాదించింది. ఒక షేరుకు మీడియన్ క్వార్టర్- సిగ్మా ఆర్డర్ సైజు ప్రస్తుతం కనీసం రూ.25 లక్షలు కాగా, దీన్ని రూ.75 లక్షల నుంచి రూ.1 కోటికి మధ్య ఉంచాలని నిర్దేశించారు. నగదు మార్కెట్లో గత 6 నెలల్లో ఒక షేరుకు ప్రతి రోజూ కనీస రోలింగ్ యావరేజ్ డెలివరీ విలువ పరిమితిని ప్రస్తుత రూ.10 కోట్ల నుంచి రూ.30- 40 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. డెరివేటివ్స్ విభాగంలో ఇప్పుడున్న ఏదైనా కంపెనీ షేరు వరుసగా 3 నెలల పాటు ఈ నియమ నిబంధనలకు అనుగుణంగా లేనిపక్షంలో, ఆ షేరును డెరివేటివ్స్ విభాగం నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత దానిపై ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ ఉండదు.. కేవలం నగదు మార్కెట్లో మాత్రమే లావాదేవీలు నిర్వహించడం సాధ్యపడుతుంది.
ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను సెబీ ఆహ్వానించింది. ఈ నెల 19 వరకు వచ్చిన అభిప్రాయాలను పరిశీలించాక, కొత్త నిబంధనలను ఖరారు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?