Cashless treatment: నగదు రహిత చికిత్సపై గంటలోపే నిర్ణయం
ఆరోగ్య బీమా పాలసీల విషయంలో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
చివరి బిల్లు చెల్లింపు 3 గంటల్లో బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం
ఆరోగ్య బీమా పాలసీలపై కొత్త నిబంధనల జారీ
ఈనాడు - హైదరాబాద్
క్లెయిమ్ పరిష్కారాల కోసం పాలసీదారులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. బీమా సంస్థలు, టీపీఏలు తమకు అవసరమైన పత్రాలను ఆసుపత్రుల నుంచి సేకరించాలని స్పష్టం చేసింది.
ఆరోగ్య బీమా పాలసీల విషయంలో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీదారు ఆసుపత్రిలో చేరి, బీమా కోసం క్లెయిం చేసిన గంటలోపే నగదు రహిత చికిత్స (క్యాష్లెస్ ఆథరైజేషన్)పై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి నుంచి తుది బిల్లు వచ్చాక, 3 గంటల్లోగా దానికి తుది అనుమతి (ఫైనల్ ఆథరైజేషన్) ఇవ్వాలని స్పష్టం చేస్తూ బుధవారం మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. ఆరోగ్య బీమా ఉత్పత్తులపై వివిధ సందర్భాల్లో జారీ చేసిన 55కు పైగా ఆదేశాల్లోని నిబంధనలను క్రోడీకరించి ఈ మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది. బీమా తీసుకునేటప్పుడు, క్లెయిం పరిష్కారాలకు సంబంధించిన అనుభవాన్ని మెరుగు పర్చేందుకు ఇది పాలసీదారులకు మార్గదర్శిగా ఉండనుంది.
- వయసు, ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఆరోగ్య బీమా పాలసీని బీమా సంస్థలు అందించాలి. ప్రీమియం చెల్లింపు సామర్థ్యం ఆధారంగా, అందుబాటులో ఉన్న పాలసీల్లో ఇష్టం ఉన్న వాటిని ప్రజలు ఎంచుకుంటారు. బీమా సంస్థ అందిస్తున్న పాలసీలు, రైడర్లు, యాడ్-ఆన్లు తదితర విస్తృత ఎంపికలను అందించాలి. అవసరాన్ని బట్టి, రకరకాల పాలసీలను తీసుకొచ్చే అవకాశం బీమా సంస్థలకు ఉంది.
- ప్రతి పాలసీ పత్రంతో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్) అందించాలి. బీమా పాలసీ రకం, బీమా మొత్తం, కవరేజీ వివరాలు, మినహాయింపులు, ఉప- పరిమితులు, తగ్గింపులు, వేచి ఉండే కాలాల వంటివి సులభ పదాల్లో ఇందులో వివరించాలి.
- పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్లు లేకపోతే.. బీమా మొత్తాన్ని పెంచడం, ప్రీమియం మొత్తాన్ని తగ్గించడం, నో క్లెయిమ్ బోనస్ ఎంచుకోవడంలో ఏదో ఒక దాన్ని ఎంచుకునే సౌలభ్యాన్ని పాలసీదారులకు సంస్థ కల్పించాలి.
- ఒకటికి మించి పాలసీలు ఉన్నప్పుడు ఏ పాలసీని ప్రాథమికంగా క్లెయిం చేసుకోవాలన్నది పాలసీదారుడు నిర్ణయించుకోవచ్చు. బిల్లు అధికంగా అయినప్పుడు మొదటి బీమా సంస్థ, మరో బీమా సంస్థతో సమన్వయం చేసుకుని, ఆ మొత్తాన్ని చెల్లించేలా చూడాలి.
- పాలసీ తీసుకునేందుకూ, పాలసీ పునరుద్ధరణ, సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితరాల కోసం అవసరమైన సాంకేతిక సేవలను అందించాలి.
- 100% నగదు రహిత చికిత్సను అందించేలా బీమా సంస్థ తగిన చర్యలను నిర్ణీత సమయంలో తీసుకోవాలి.
- ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రుల వివరాలను తమ వెబ్సైట్లలో సంస్థ తప్పనిసరిగా పేర్కొనాలి. ఒకవేళ ఒప్పందం లేని ఆసుపత్రిలో పాలసీదారు చేరితే, పాటించాల్సిన విధానాలను తెలియజేయాలి.
- ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఐఐబీ) పోర్టల్లో ఆరోగ్య బీమా పాలసీల పోర్టబిలిటీకి దరఖాస్తు చేసినప్పుడు.. రెండు బీమా సంస్థలూ నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవాలి.
- బీమా అంబుడ్స్మన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని పక్షంలో, బీమా సంస్థ పాలసీదారుకు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాలి.
- చికిత్స సమయంలో పాలసీదారు మరణిస్తే, మృతదేహాన్ని వెంటనే బంధువులకు అప్పగించాలని ఐఆర్డీఏఐ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు