Crime News: ఏలూరులో దారుణం.. ప్రియురాలిని కత్తితో నరికి చంపిన ప్రియుడు

ప్రియురాలిని ఓయువకుడు కత్తితో నరికి దారుణంగా హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.

Updated : 30 May 2024 15:28 IST

ఏలూరు: ప్రియురాలిని ఓ యువకుడు కత్తితో నరికి దారుణంగా హతమార్చిన ఘటన ఏలూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం నగరంలోని సత్రంపాడు సాయిబాబా గుడి వద్ద యువతిపై కత్తితో దాడి చేసిన అనంతరం యువకుడు కూడా అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని