Hyderabad: హైదరాబాద్‌లో ఏపీ టీచర్‌ అనుమానాస్పద మృతి

నగరంలో ఏపీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. మియాపూర్‌లోని ఓయో లాడ్జిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 26 May 2024 17:48 IST

హైదరాబాద్‌: మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లా రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జయప్రకాశ్‌ నారాయణ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. రాయచోటి వెళ్తున్నానని చెప్పి నిన్న మధ్యాహ్నం కూకట్‌పల్లి నుంచి బయల్దేరిన జయప్రకాశ్‌..  మియాపూర్‌ మదీనాగూడలోని ఓయో లాడ్జిలో రూమ్‌ తీసుకున్నాడు. అనంతరం విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జయప్రకాశ్‌కు ఇంకా వివాహం కాలేదని, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని