Paradip Port: ఒడిశా తీరంలో రూ.220 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
ఒడిశా తీరంలో ఓ నౌకలో రూ.220 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
భువనేశ్వర్: ఒడిశా తీరంలో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు (Drugs) పట్టుబడ్డాయి. ఇక్కడి పారాదీప్ నౌకాశ్రయం (Paradip Port)లో లంగరు వేసిన ఓ నౌకలో రూ.220 కోట్ల విలువ చేసే కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. పనామాలో రిజిస్టర్ అయిన ఓ సరకు రవాణా నౌక (MV Debi) ఈజిప్టు నుంచి ఇండోనేషియా మీదుగా పారాదీప్ పోర్టుకు చేరుకుంది. ఇక్కడి నుంచి స్టీల్ ప్లేట్లతో అది డెన్మార్క్కు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఓడలోని క్రేన్లో 22 అనుమానాస్పద ప్యాకెట్లను గుర్తించిన ఆపరేటర్.. వాటిని పేలుడు పదార్థంగా భావించి అధికారులకు సమాచారం అందించాడు.
తుపాకీ గురిపెట్టి.. బ్యాంకులో ₹18 కోట్లు దోపిడీ
పరీక్షల అనంతరం అది కొకైన్గా నిర్ధారణ అయిందని అధికారులు చెప్పారు. ‘ఓడలోని క్రేన్ నుంచి 22 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాం. ప్రత్యేక కిట్ను ఉపయోగించి పరీక్షించిన తర్వాత అందులోని పదార్థం ‘కొకైన్’గా తేలింది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ మార్కెట్లో రూ.200 కోట్ల నుంచి రూ.220 కోట్ల మధ్య ఉంటుంది’ అని రాష్ట్ర కస్టమ్స్ కమిషనర్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. అయితే.. నౌకలోని వియత్నాంకు చెందిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఓడలో జాగిలాల సాయంతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ