Paradip Port: ఒడిశా తీరంలో రూ.220 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
ఒడిశా తీరంలో ఓ నౌకలో రూ.220 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
భువనేశ్వర్: ఒడిశా తీరంలో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు (Drugs) పట్టుబడ్డాయి. ఇక్కడి పారాదీప్ నౌకాశ్రయం (Paradip Port)లో లంగరు వేసిన ఓ నౌకలో రూ.220 కోట్ల విలువ చేసే కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. పనామాలో రిజిస్టర్ అయిన ఓ సరకు రవాణా నౌక (MV Debi) ఈజిప్టు నుంచి ఇండోనేషియా మీదుగా పారాదీప్ పోర్టుకు చేరుకుంది. ఇక్కడి నుంచి స్టీల్ ప్లేట్లతో అది డెన్మార్క్కు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఓడలోని క్రేన్లో 22 అనుమానాస్పద ప్యాకెట్లను గుర్తించిన ఆపరేటర్.. వాటిని పేలుడు పదార్థంగా భావించి అధికారులకు సమాచారం అందించాడు.
తుపాకీ గురిపెట్టి.. బ్యాంకులో ₹18 కోట్లు దోపిడీ
పరీక్షల అనంతరం అది కొకైన్గా నిర్ధారణ అయిందని అధికారులు చెప్పారు. ‘ఓడలోని క్రేన్ నుంచి 22 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాం. ప్రత్యేక కిట్ను ఉపయోగించి పరీక్షించిన తర్వాత అందులోని పదార్థం ‘కొకైన్’గా తేలింది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ మార్కెట్లో రూ.200 కోట్ల నుంచి రూ.220 కోట్ల మధ్య ఉంటుంది’ అని రాష్ట్ర కస్టమ్స్ కమిషనర్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. అయితే.. నౌకలోని వియత్నాంకు చెందిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఓడలో జాగిలాల సాయంతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
సైబర్ నేరగాళ్ల చేతికి ‘మ్యూల్ ఖాతాలు’
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న పెద్ద ముఠాలో కీలక సభ్యుడైన ఓ యువకుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. -
రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన నిందితుడు కస్టడీలో ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. -
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడి మృతి
ఐస్గా భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు
తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ లాక్కొన్నారు.. అడ్డగిస్తే కత్తులతో పొడిచారు
చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని పోతున్న వారిని పట్టుకోబోయిన యువకుడిని నిందితులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషాదకర ఘటన హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!