Atiq Ahmed: తుర్కియే తుపాకులతో అతీక్ హత్య.. రెండ్రోజుల ముందే మాటు వేసి..!
గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడి హత్యకు అత్యాధునిక తుర్కియే ఆయుధాలు వాడినట్లు గుర్తించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన హంతకుల వద్దకు ఈ ఆయుధాలు ఎలా చేరాయన్న విషయంపై అధికారులు విచారణ మొదలుపెట్టారు.
ఇంటర్నెట్డెస్క్ : ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ను చంపిన నిందితులు అత్యాధునిక ఆయుధాలను వాడినట్లు పోలీసులు గుర్తించారు. హంతకులు తుర్కియేకు చెందిన ‘టిసాస్’ కంపెనీ తయారు చేసిన సెమీ-ఆటోమేటిక్ ఆయుధమైన ‘జిగాన’(Zigana) పిస్తోల్ను వాడినట్లు సమాచారం. తుర్కియేలో పాలిమర్ ఫ్రేమ్తో తయారైన తొలి పిస్తోల్ ఇదే. ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటీ రూ.ఆరు లక్షలకు పైగా ఉంటుంది. అక్కడి సైన్యం, ప్రత్యేక దళాలు, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ తుపాకులను వాడుతున్నాయి. భారత్లో వీటిపై నిషేధం ఉంది.
మరోవైపు పాకిస్థాన్ నుంచి వీటిని దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ తుర్కియే తుపాకులకు పాకిస్థాన్ నకళ్లను తయారు చేస్తోంది. ఇవి అసలు తుపాకులంత నాణ్యతతో ఉన్నా.. ధరలో మాత్రం చౌకగా లభిస్తుంటాయి. పాకిస్థాన్లో ‘గన్ వ్యాలీ’గా పేరున్న ‘దర్రా ఆదమ్ ఖేల్’ అనే ప్రాంతంలో దాదాపు 2,000 ఆయుధ షాపులు ఉన్నాయి. జిగాన తుపాకులు అత్యంత నమ్మకంగా పనిచేయడంతోపాటు.. మిగిలిన అధునాతన తుపాకుల కంటే తక్కువ ధరలో లభిస్తాయి. సాధారణంగా ఆయుధ నిపుణులకు మాత్రమే తెలిసే ఇటువంటి తుపాకులు అతీక్(Atiq Ahmed) సోదరుల హంతకులు వాడటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతోపాటు ఇంత ఖరీదైన తుపాకులు కొనేంత ఆర్థిక సామర్థ్యం కూడా వారికి లేదు. ఈ హంతకులు ముగ్గురూ పేద కుటంబాల నుంచి వచ్చిన వారే.
తెరపైకి గ్యాంగ్స్టర్ సుందర్ భాటి పేరు..
అతీక్ సోదరులను హత్య చేసిన హంతకుల్లో ఒకడైన సన్నీకి పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్ సుందర్ భాటితో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. ఈ హత్యకు వాడిన జిగాన తుపాకులు సుందర్ నుంచే సన్నీకి చేరినట్లు అనుమానిస్తున్నారు. యూపీలో గౌతం బుద్ధా నగర్ జిల్లాలోని గంఘోలా గ్రామానికి చెందిన భాటిపై 60కిపైగా కేసులు ఉన్నాయి. ఓ హత్య కేసులో అతడు సోనభద్ర జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం సన్నీ, సుందర్ హమీర్పూర్ జైల్లో కలుసుకొన్నారు. అక్కడే వీరి పరిచయం పెరిగింది. సన్నీని భాటి తన గ్యాంగ్లో చేర్చుకొన్నాడు. ఆ గ్యాంగ్ వద్ద అత్యాధునిక ఆయుధాలున్నట్లు అనుమానాలున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సన్నీ.. భాటి మనుషులతో టచ్లో ఉన్నాడు. భాటికి పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు, ఆయుధ స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. అయితే.. భాటికి అతీక్(Atiq Ahmed)కు పాత విరోధాలు ఉన్నట్లు బయటపడలేదు.
అతీక్(Atiq Ahmed), అష్రాఫ్ మృతదేహాల్లో 14 తూటాలు..
గ్యాంగ్స్టర్ అతీక్(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్ మృతదేహాలకు నిన్న పోస్టుమార్టం నిర్వహించారు. అతీక్ మృతదేహం నుంచి మొత్తం 9 తూటాలను వెలికి తీయగా.. అష్రాఫ్ మృతదేహం నుంచి 5 తూటాలను గుర్తించారు. అతీక్ను అతి దగ్గర నుంచి ఒక సారి తలపై కాల్చగా.. దాదాపు 8 సార్లు ఛాతిపై కాల్పులు జరిపినట్లు తేలింది. మరోవైప్ అష్రాఫ్ ముఖంపై రెండుసార్లు.. మిగిలిన రౌండ్లు శరీరంపై కాల్చినట్లు పోస్టుమార్టం రిపోర్టు పేర్కొంది.
హంతకులు రెండ్రోజుల ముందు నుంచి ప్రయాగ్రాజ్లోనే మాటు వేసి..
అతీక్, అష్రాఫ్ను హత్య చేసిన ముగ్గురు హంతకులు ప్రయాగ్రాజ్లోనే ఓ హోటల్లో ఘటనకు రెండ్రోజుల ముందు నుంచి బస చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ముగ్గురు హంతకులకు పరిచయం ఎలా ఏర్పడింది? ఎప్పుడు కలుసుకొన్నారు? ఈ హత్యకు ప్లానింగ్ ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారన్న విషయాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి