Kakinada: గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు వెలికితీత
విద్యార్థుల విహారయాత్ర విషాదాన్ని మిగిల్చింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు శనివారం గల్లంతయ్యారు.
తాళ్లరేవు: విద్యార్థుల విహారయాత్ర విషాదాన్ని మిగిల్చింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు శనివారం గల్లంతయ్యారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది.. ఆదివారం ఉదయం నలుగురి మృతదేహాలను వెలికితీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు.
గోదావరిలో నలుగురు యువకుల గల్లంతు
ప.గో. జిల్లా తణుకు పట్టణంలోని సజ్జాపురం ప్రాంతానికి చెందిన ఏడుగురు మూడు ద్విచక్ర వాహనాలపై శనివారం గోపులంక పుష్కరఘాట్ వద్దకు చేరుకున్నారు. తన పుట్టినరోజున స్నేహితులతో కలిసి విహారానికి వచ్చిన హనుమకొండ కార్తిక్(21) గోదావరిలో స్నానానికి దిగాడు. అతను నీటిలో మునిగిపోతుండడాన్ని ఒడ్టునున్న మిగిలిన ఆరుగురిలో మద్దెన ఫణీంద్ర గణేష్(21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ(21)లు గమనించారు. కార్తిక్ను రక్షించేందుకు వెంటనే గోదావరిలో దిగారు. వీరు కూడా ప్రవాహానికి కొట్టుకుపోతుండటంతో వారిని ఒడ్డుకు తెచ్చేందుకు సలాది దుర్గామహేష్, కొమ్మిరెడ్డి చైతన్య నదిలో దిగారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెనక్కి వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. వీరితోపాటు వచ్చిన మరో యువకుడు నేదూరు భానుప్రసాద్ జరిగిన ఘటనతో భయాందోళన చెంది అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.