గోదావరిలో నలుగురు యువకుల గల్లంతు
వారందరిదీ ఒకే వీధి. సెలవుల్లో సరదాగా విహారయాత్రలకు వెళ్తుంటారు. స్నేహితుడి పుట్టినరోజున సరదాగా గడిపేందుకు వచ్చి ఏడుగురిలో నలుగురు గోదావరిలో గల్లంతైన విచారకర ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో జరిగింది.
స్నేహితుడి పుట్టినరోజున విహారయాత్రలో ఘటన
గోదావరిలో గల్లంతైన యువకులు బాలాజీ, రవితేజ, ఫణీంద్ర గణేష్, కార్తిక్
తాళ్లరేవు, న్యూస్టుడే: వారందరిదీ ఒకే వీధి. సెలవుల్లో సరదాగా విహారయాత్రలకు వెళ్తుంటారు. స్నేహితుడి పుట్టినరోజున సరదాగా గడిపేందుకు వచ్చి ఏడుగురిలో నలుగురు గోదావరిలో గల్లంతైన విచారకర ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని సజ్జాపురం ప్రాంతానికి చెందిన ఏడుగురు మూడు ద్విచక్ర వాహనాలపై శనివారం మధ్యాహ్నం మూడు గంటలప్పుడు యానాం వచ్చారు. అక్కడి నుంచి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని గోపులంక పుష్కరఘాట్ వద్దకు చేరుకున్నారు. తన పుట్టినరోజున స్నేహితులతో కలిసి విహారానికి వచ్చిన హనుమకొండ కార్తిక్(21) గోదావరిలో స్నానానికి దిగాడు. అతను నీటిలో మునిగిపోతుండడాన్ని ఒడ్టునున్న మిగిలిన ఆరుగురిలో మద్దెన ఫణీంద్ర గణేష్(21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ(21)లు గమనించారు. కార్తిక్ను రక్షించేందుకు వెంటనే గోదావరిలో దిగారు. వీరు కూడా ప్రవాహానికి కొట్టుకుపోతుండటంతో వారిని ఒడ్డుకు తెచ్చేందుకు సలాది దుర్గామహేష్, కొమ్మిరెడ్డి చైతన్య నదిలో దిగారు. ఎంత ప్రయత్నించినా వల్లకాక వెనక్కి వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తమ కళ్ల ఎదుటే స్నేహితులు గోదావరిలో మునిగిపోతున్నా.. తామేమీ చేయలేకపోయామంటూ కన్నీరుపెట్టుకున్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చామని, ఇప్పుడు గల్లంతైనవారి కుటుంబ సభ్యులకు ఏంచెప్పాలో తెలియడం లేదని విలపించారు. సాయంత్రం వరకు ప్రకృతి ఒడిలో సందడిచేసి ఇళ్లకు వెళ్లిపోదామనుకున్నామని, ఇంతలోనే దుర్ఘటన జరిగిందని విలపించిన తీరు స్థానికులనుసైతం కంటతడి పెట్టించింది. వీరితోపాటు వచ్చిన మరో యువకుడు నేదూరు భానుప్రసాద్ జరిగిన ఘటనతో భయాందోళన చెంది అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయాడని అక్కడున్నవారు తెలిపారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద గోదావరిలో
గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
జీవిత చరమాంకంలో తమకు తోడుగా ఉంటారని భావించిన కన్న బిడ్డలు ఆచూకీ లేకుండా గోదావరిలో గల్లంతయ్యారనే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ బిడ్డలేమయ్యారంటూ విలపించారు. వీరిలో కొందరు ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో యువకులు గల్లంతైన ఘటనపై కేసు నమోదు చేశామని తాళ్లరేవు పోలీసులు తెలిపారు. పడవలు, వలలతో గోదావరిలో వారు గల్లంతైన ప్రాంతం దిగువన కొంతదూరం వరకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి కాకినాడ గ్రామీణ సీఐ కె.శ్రీనివాస్, తాళ్లరేవు తహసీల్దారు ఎస్.పోతురాజు, కోరంగి ఎస్సై రవికుమార్ తదితరులు వచ్చారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యదేవుని కళ్యాణ మహోత్సవం ప్రారంభం
[ 18-05-2024]
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. -
మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
[ 18-05-2024]
తాళ్లరేవు బీమాబాయి మహిళ మండలి కార్యాలయం లో శనివారం మహిళా రక్షణ చట్టాలపై జిల్లా స్థాయి అవగాహక కార్యక్రమం జరిగింది. -
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
[ 18-05-2024]
అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. -
సుప్రీం చెప్పినా వినరా?
[ 18-05-2024]
ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. -
ఎదురు చూపులే మిగిలినే..!
[ 18-05-2024]
చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. -
అదే నిర్లిప్తత!
[ 18-05-2024]
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. -
పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. -
మీసాలరాయుడికి.. కల్యాణ సోయగం
[ 18-05-2024]
అన్నవరం సత్యదేవుని కల్యాణ వేడుకకు రత్నగిరి ముస్తాబైంది. శనివారం నుంచి సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. -
4 వరకు నిషేధాజ్ఞలు
[ 18-05-2024]
జిల్లాలో జూన్ 4వ తేదీవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ తెలిపారు. -
పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!
[ 18-05-2024]
పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. -
తొలగని ముంపు ముప్పు
[ 18-05-2024]
సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
[ 18-05-2024]
ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. -
భావనారాయణస్వామి పెండ్లికుమారుడాయెనే..
[ 18-05-2024]
సర్పవరం క్షేత్రంలో వెలిసిన స్వయంభు శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ ఉత్సవాలు తొలిరోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యయి. -
జగన్ను ఇడుపులపాయ పంపడమే మా నినాదం
[ 18-05-2024]
మోదీని ఇంటికి, జగన్ను ఇడుపులపాయకు పంపాలన్నదే తమ నినాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. -
వరి మాసూళ్లకు చోటేదీ..!
[ 18-05-2024]
ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. -
అందొచ్చాడనుకుంటే.. అందకుండా పోయాడు
[ 18-05-2024]
జాతీయరహదారి 216(ఏ)పై మూలస్థాన అగ్రహారం వద్ద శుక్రవారం కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 18-05-2024]
విద్యుదాఘాతంలో మేడవరపు రామతారకం(55) అనే మహిళ మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ