Crime News: తల్లి ‘బీమా’ డబ్బు కోసం కొడుకుల కొట్లాట.. ఒకరు మృతి!

తల్లి మరణంతో వచ్చిన బీమా డబ్బులను పంచుకునే విషయంలో ముగ్గురు సోదరుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో దాడులు చేసుకోవడంతో.. వారిలో ఒకరు మృతి చెందారు.

Published : 15 Sep 2023 21:25 IST

లఖ్‌నవూ: ఆస్తి కోసం సొంతవారినే కడతేరుస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తల్లి మరణం తర్వాత ఆమె పేరుతో వచ్చిన బీమా డబ్బు కోసం ముగ్గురు సోదరులు కొట్లాడుకున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో తాజాగా వెలుగు చూసింది. ఈ ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సింగపూర్‌లో ఇద్దరు భారతీయుల మధ్య గొడవ.. చేతి వేలు కొరికినందుకు జైలు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పుర్వా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పశ్చిమ తోలా గ్రామానికి చెందిన ఓ మహిళ కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె పేరుమీదున్న బీమా కింద రూ.2  లక్షల నగదును పెద్ద కుమారుడు అందుకున్నాడు. అయితే, డబ్బు పంపకాల విషయంలో ముగ్గురు సోదరుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇది కాస్త ముదిరి.. ఒకరినొకరు కర్రలతో కొట్టుకునే స్థాయికి వెళ్లింది. తీవ్ర ఘర్షణలో చిన్న సోదరుడు రామ్‌ ఆస్రే (45) ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మిగతా ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని