Murder: భారాస కార్యకర్త హత్య
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన భారాస కార్యకర్త బొడ్డు శ్రీధర్రెడ్డి (48) హత్యకు గురయ్యారు.
బొడ్డు శ్రీధర్ రెడ్డి
చిన్నంబావి, న్యూస్టుడే: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన భారాస కార్యకర్త బొడ్డు శ్రీధర్రెడ్డి (48) హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి తన ఇంటి పక్కన మంచంపై నిద్రిస్తున్న సమయంలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం సభ్యులు హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ భారాసలో క్రియాశీలక పాత్ర పోషిస్తుండటంతో రాజకీయంగా గిట్టని వారే హత్య చేయించి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు.
చిన్నంబావి నుంచి లక్ష్మీపల్లి వరకు ర్యాలీగా వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్.
చిత్రంలో గువ్వల బాలరాజు, శ్రీనివాస్గౌడ్, బీరం హర్షవర్ధన్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులు
రాష్ట్రంలో ప్రతీకార పాలన: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన చేపడుతోందని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన భారాస కార్యకర్త శ్రీధర్రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు చిన్నంబావి నుంచి లక్ష్మీపల్లి వరకు మృతదేహంతో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో సహకరించని వారిపై కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు హత్యారాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. గత 5 నెలల్లోనే మంత్రి ప్రోద్బలంతో ఇద్దరు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. మంత్రిని వెంటనే క్యాబినెట్ నుంచి తొలగించాలని సీఎం రేవంత్ను డిమాండ్ చేశారు. వరుస హత్యలపై సిట్ లేదా న్యాయవిచారణ చేపట్టాలన్నారు. తమ పాలనలో ఎన్నడూ హత్యారాజకీయాలు జరగలేదన్నారు. రాష్ట్రంలో దాడుల సంస్కృతి కొనసాగితే అధికార పార్టీ నాయకుల ఇళ్లను ముట్టడించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. హతుడి తండ్రి శేఖర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో మంత్రి జూపల్లి పేరును చేర్చకుండా పోలీసులు ఫిర్యాదుదారుడిపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఆయన వెంట మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అభిలాష్రావు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.