Crime: ప్రీవెడ్డింగ్‌ ఫంక్షన్‌లో వివాదం..యువకుడిని టెర్రస్‌పై నుంచి తోసేసిన వ్యాపారవేత్త

ఓ ప్రీవెడ్డింగ్‌ వేడుకలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తికి ప్రాణాంతకంగా మారింది. 

Updated : 22 Apr 2024 13:18 IST

లఖ్‌నవూ: స్నేహితుడి ప్రీవెడ్డింగ్‌ పార్టీలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. పోలీసుల కథనం ప్రకారం బరేలీలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఆదివారం ఓ వ్యాపారవేత్త కుమారుడి ప్రీవెడ్డింగ్‌ పార్టీ ఘనంగా నిర్వహించారు. వరుడి స్నేహితుడు రిదిమ్ అరోరా, అదే హోటల్‌కు వచ్చిన మరో యువకుడు సార్థక్ అగర్వాల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పరస్పరం దాడికి దిగారు. దీంతో రిదిమ్ తన తండ్రి, టెక్స్‌టైల్ వ్యాపారి అయిన సంజీవ్ అరోరాకు ఫోన్‌ చేసి సంఘటనా స్థలానికి పిలిపించాడు. 

అక్కడికి చేరుకున్న యువకుడి తండ్రి ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. సార్థక్‌ అగర్వాల్‌పై దాడి చేసి హోటల్‌ టెర్రస్ పైనుంచి కిందకు తోశాడు. అంతటితో ఆగకుండా మరో యువకుడిపై దాడి చేశాడు. కింద పడిన సార్థక్ అగర్వాల్‌ తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున 2గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని, అందరూ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు