Kakinada: వైకాపా నేతల వీరంగం.. దర్శకుడు కల్యాణ్‌ కృష్ణతో పాటు ఆరుగురిపై కేసు

కాకినాడ నగరంలోని రెండో డివిజన్‌ చర్చికాంత నగర్‌లో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు.

Updated : 03 Apr 2024 19:42 IST

కాకినాడ: కాకినాడ నగరంలోని రెండో డివిజన్‌ చర్చికాంత నగర్‌లో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు. జనసేన, భాజపా నాయకులపై దాడికి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. . కాకినాడ గ్రామీణ జడ్పీటీసీ నురుకుర్తి రామక్రిష్ణ, గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సోదరుడు, సినీ డైరెక్టర్‌ కళ్యాణ కృష్ణ, వైకాపా నాయకుడు కడియాల చిన్నబాబు, తిమ్మాపురం సర్పంచి, జేఎన్‌టీయూకే ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, మేమం సర్పంచి  రామ్‌దేవ్‌ చిన్న.. మరొకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సర్పవరం ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని