Bengaluru rave party: రేవ్ పార్టీ కేసులో కదులుతున్న డొంక.. ఏపీ మంత్రి కాకాణి అనుచరుడి అరెస్టు
బెంగళూరు రేవ్పార్టీ కేసు దర్యాప్తును నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నటి హేమ సహా 8 మందికి విచారణ నోటీసులు
బెంగళూరు, న్యూస్టుడే: బెంగళూరు రేవ్పార్టీ కేసు దర్యాప్తును నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణను ఎదుర్కొంటున్న వారిలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డిల అనుచరులు కొందరు ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో మంత్రి కాకాణి పేరు ఉన్న కారు స్టిక్కర్ను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా హైదరాబాద్కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రేవ్పార్టీ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర పోషించారని, ఆయన మంత్రి అనుచరుడేనని పోలీసులు ధ్రువీకరించారు. ఇప్పటికే అరెస్టు అయిన ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి అనుచరుడు అరుణ్కుమార్ సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. ఈ పార్టీలో పాల్గొన్న తెలుగు సినీ నటి హేమ సహా మొత్తం ఎనిమిది మందికి సీసీబీ పోలీసులు శనివారం నోటీసులు జారీచేశారు. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో బయటపడగా.. అందులో 59 మంది పురుషులు, 27 మంది యువతులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంటల వ్యవధిలో అల్లుడు, అత్త మృతి
గంటల వ్యవధిలో గుండెపోటుతో అల్లుడు, అత్త మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలంలో చోటుచేసుకుంది. -
మాదాపూర్లో యువకుడి అనుమానాస్పద మృతి
నగరంలోని మాదాపూర్లో సాయి అనే యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. అయ్యప్ప సొసైటీలోని ఓ హోటల్ ఆరో అంతస్తు పైనుంచి పడి మరణించాడు. -
ఏనుగు దాడిలో వృద్ధుడి దుర్మరణం.. చిత్తూరు జిల్లాలో ఘటన
ఏనుగు దాడిలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పీయం తండాలో చోటుచేసుకుంది. కుప్పం ఎఫ్ఆర్వో జయశంకర్ వివరాల మేరకు.. తండాకు చెందిన కన్నానాయక్(65) శనివారం రాత్రి పశువులను కట్టేసేందుకు కొట్టంలోకి వెళ్లారు. -
హత్యకు దారి తీసిన ఘర్షణ
అప్పు చెల్లించే విషయంలో జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం పడాల గ్రామం విజయదుర్గ ఆలయం పక్క రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కొప్పర్తి రాంబాబు -
ఫైనాన్స్ వాహనాలే లక్ష్యంగా మోసాలు
-
ఘర్షణ ఘటనలో 14 మంది అరెస్టు
గోవుల రవాణా నేపథ్యంలో శనివారం రాత్రి మెదక్లో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఘటనను నిరసిస్తూ ఆదివారం పట్టణ బంద్కు ఓ వర్గం పిలుపునిచ్చింది. -
నాన్న.. రావా..
కుటుంబ సభ్యులంతా శుభకార్యానికి హాజరయ్యారు.. తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదంలో కళ్లెదుట తండ్రి మృతిచెందారు.. అప్పటి వరకు సంతోషంగా గడిపిన నాన్న.. విగతజీవిగా ఉండటంతో పిల్లలిద్దరి రోదనలు మిన్నంటాయి. -
చికెన్ ఇవ్వలేదని వ్యక్తి దారుణ హత్య
చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని మద్యం మత్తులో మరో వ్యక్తి బండరాయితో మోది హత్య చేసిన ఘటన హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి: కేంద్ర న్యాయశాఖ మంత్రి
-
క్రోమ్లో కొత్త సదుపాయం.. ఆండ్రాయిడ్ యూజర్లు ఇక వెబ్ పేజీలు వినొచ్చు
-
కరెంటు షాక్ ఇచ్చి.. దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు!
-
డిలీట్ చేసిన మెసేజ్లు భార్య కంటికి.. యాపిల్పై రూ.53 కోట్లకు దావా
-
జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత
-
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం