Murder: చిన్నారుల హత్యలు.. కీలక విషయాలు వెలుగులోకి

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఇద్దరు బాలురుని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Published : 20 Mar 2024 13:28 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని తమ ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరు బాలురుని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం హంతకుడు సాజిద్ బాధితుల ఇంటికి ఎదురుగా బార్బర్ షాప్ నడుపుతున్నాడు. అతడికి చిన్నారుల తండ్రితో పరిచయం ఉంది.

మంగళవారం సాయంత్రం వారి ఇంటికి వచ్చిన సాజిద్ తన భార్య ఆసుపత్రిలో ఉందని, చికిత్స నిమిత్తం రూ.5,000 అవసరమని వినోద్ భార్య సంగీతను కోరాడు. ఆమె భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో డబ్బు అప్పుగా ఇవ్వమని అతడు సూచించాడు. ఈ క్రమంలో ఆమె వంటగదిలోకి వెళ్లి టీ తయారు చేస్తోంది. అదే సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న ఆయుష్‌(12)ను సాజిద్ మేడమీద ఉన్న సంగీత బ్యూటీ సెలూన్‌ను చూపించమని అడిగాడు. ఆ బాలుడు అతడిని మేడ మీదకు తీసుకువెళ్లగా రెండో అంతస్తులో సాజిద్ లైట్లు ఆఫ్‌చేసి ఆయుష్‌పై కత్తితో దాడి చేసి హతమార్చాడు.

బాలుడి సోదరులు అహాన్(7), పియూష్‌(6) అదే సమయంలో అక్కడికి రావడంతో వారిపైనా దాడి చేశాడు. దీంతో అహాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. అయితే పియూష్‌ దాక్కోవడంతో స్వల్ప గాయాలతో దాడి నుంచి తప్పించుకొన్నాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు.. అతడి దుకాణానికి నిప్పంటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు