Crime news : బైక్పై లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్లో (Uttar pradesh) దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇస్తామని నమ్మబలికి ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
లఖ్నవూ: కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థినికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఆ దురాగతాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని (Uttar pradesh) ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం ఆమె కళాశాల నుంచి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు తెలిసిన వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె దగ్గర ఆపారు. ఇంటి దగ్గర దిగబెడతామని చెప్పి బాలికను బైక్పై ఎక్కించుకున్నారు.
హెల్మెట్లు ధరించి ఏటీఎం వద్ద తచ్చాడుతూ.. గార్డును చంపి..
ఆ తరువాత ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. అక్కడికి మరో ముగ్గురు వ్యక్తులు చేరుకున్నారు. ఆ ఐదుగురూ కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని ఓ కూడలి వద్ద వదిలిపెట్టారు. ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారిపై పోక్సో సహా పలు కేసులు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మీరట్ ఆస్పత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి
తాము ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డుగా వచ్చిన వానరాన్ని తప్పించబోయి ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. -
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. -
కుటుంబాన్ని పగబట్టిన విధి!
ఎన్నికల విధులకు కుమారుడితో కలిసి వెళ్లిన మహిళను రైలు ఢీకొట్టింది. -
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం దుర్మరణం
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పురపాలిక పరిధి శేర్పల్లి(బి) వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం(42) దుర్మరణం పాలయ్యారు. -
బెట్టింగ్కు బానిసైన కుమారుడి హత్య..
క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడిన యువకుడు రూ.కోట్లలో అప్పు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశాడనే ఆక్రోశంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. -
ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంకు పేలి.. 10 మందికి గాయాలు
ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంకు పేలుడు హైదరాబాద్లోని పాతబస్తీ భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధి తలాబ్కట్టలో విధ్వంసం సృష్టించింది. -
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి హఠాన్మరణం
ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్బూత్కు వచ్చిన ఓ ప్రిసైడింగ్ అధికారి(పీవో) గుండెపోటుతో మృతి చెందారు. -
తెదేపా నేత అనుమానాస్పద మృతి
పల్నాడు జిల్లా గురజాల మండలం బూదవాడ గ్రామానికి చెందిన తెదేపా నేత దాసరి బ్రహ్మయ్య (33) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. -
ఏనుగు దాడిలో వ్యక్తి మృతి
జిల్లాలో ఏనుగుల సంచారం ఇటీవల పెరిగిపోయింది. -
తెదేపాలో చేరారని న్యాయవాది కారు దహనం
తెదేపాలో చేరారని న్యాయవాది కారుని వైకాపా నాయకులు దహనం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
కారులో కోటిన్నర వదిలేసి డ్రైవర్ పరారీ
ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న విశాఖపట్నం పోలీసులు ఓ కారులోని రూ.1.50 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి