Crime news : హెల్మెట్లు ధరించి ఏటీఎం వద్ద తచ్చాడుతూ.. గార్డును చంపి..
ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) ఓ ముఠా హెల్మెట్లు ధరించి వచ్చి ఏటీఏంలో (ATM) నగదు నింపే వ్యాన్ను చోరీ చేసింది. ఈ క్రమంలో దుండగులు ఓ గార్డును కాల్చి చంపారు.
Image : Pt_shekhardixit
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం (Uttar Pradesh) మీర్జాపుర్లో దోపిడీ దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. ఓ ఏటీఎం (ATM) ముందు తచ్చాడుతూ తిరిగి.. అందులో డబ్బులు నింపడానికి వచ్చిన వ్యాన్ను లూటీ చేశారు. ఈ క్రమంలో ఓ గార్డును కాల్చి చంపి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కత్రా కొత్వాలి ప్రాంతంలోని బెల్టార్లో యాక్సిస్ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉంది. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు మంగళవారం ఇద్దరు క్యాషియర్లు, ఓ గార్డు వ్యాన్లో వచ్చారు. వారు దిగి డబ్బులు ఏటీఎంలో నింపే పనిలో నిమగ్నం అవుతుండగా.. తొలుత హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి అక్కడ తచ్చాడుతూ కనిపించాడు.
బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చేతివాటం.. రూ.8.65 కోట్ల బురిడీ
బ్యాంకు ఉద్యోగులు వ్యాన్ తలుపు తెరవగానే హెల్మెట్ ధరించి వచ్చిన మరో దుండగుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెంటనే గార్డును తుపాకీతో కాల్చాడు. దాంతో గార్డు కిందపడిపోయాడు. లేవడానికి ప్రయత్నించి స్పృహ తప్పి మళ్లీ పడిపోయాడు. ఇంతలో తెల్ల చొక్కా ధరించి వచ్చిన మరో దుండగుడు వ్యాన్ డోరు వద్దకు వెళ్లి రూ.39 లక్షల నగదుతో ఉన్న పెట్టెను తీసుకొని పరాయ్యాడు. ఈ లోగా ఓ బ్యాంకు ఉద్యోగి అప్రమత్తమై పారిపోగా.. మరో ఉద్యోగి తన బ్యాగు తీసుకొని వ్యాన్లో కూర్చున్నాడు. రోడ్డు పక్కనే ఆగి ఉన్న మరో దుండగుడు అతడితో పెనుగులాడి ఆ బ్యాగు లాక్కొని పారిపోయాడు. మొత్తం నలుగురు వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిసింది. ముఖాలు కన్పించకుండా జాగ్రత్త పడిన ఆ ముఠా బైక్లపై పరారైనట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన గార్డును ఓ ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించగా.. అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ సమాచారం తెలిసి డీఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ చోరీలో ఎంత నగదు పోయిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి