Crime news: సైడ్‌ మిర్రర్‌కు బైకు తాకిందని.. యువకుడిని కారుతో గుద్ది చంపిన దంపతులు

Eenadu icon
By Crime News Desk Published : 30 Oct 2025 05:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నిందితులు మనోజ్‌కుమార్, ఆరతి శర్మ

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే: సైడ్‌ మిర్రర్‌కు బైకు తాకిందని... గొడవపడి, ఓ యువకుడిని దంపతులు వెంటాడి కారుతో గుద్ది చంపిన దారుణమిది. బెంగళూరులో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానిక పుట్టేనహళ్లి ఠాణా పోలీసుల కథనం ప్రకారం... ఈ నెల 22న అర్ధరాత్రి దర్శన్‌ తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి శ్రీరామ లేఅవుట్లో బైకుపై వెళ్తున్నారు. ఆ సమయంలో పక్కగా వెళుతున్న కారు సైడు మిర్రర్‌ను వీరి బైకు తాకింది. కారులో ఉన్న మనోజ్‌కుమార్, ఆయన భార్య ఆరతి శర్మ... దర్శన్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బైకును దంపతులు కారులో రెండు కి.మీ. వెంబడించారు. వెనక నుంచి బైకును ఢీకొట్టి వెళ్లిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్‌లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ దర్శన్‌ చనిపోయారు. వరుణ్‌ చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో కారు విడిభాగాలు కొన్ని పడిపోగా.. మనోజ్, ఆరతి ముఖాలకు మాస్కులు వేసుకుని వెనక్కి వచ్చి వాటిని తీసుకెళ్లారు. ఈ వైనాన్ని అక్కడి నిఘా కెమెరాల ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. నిందితులను జేపీనగర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని