భద్రతా బలగాలపై మావోయిస్టుల దాడి.. సీఆర్పీఎఫ్ ఏఎస్సై మృతి
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై మృతి చెందగా, ఒక జవాను తీవ్రంగా గాయపడ్డాడు.
రాయ్పుర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలోని జగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెద్రెలో జరుగుతున్న వారాంతపు సంతలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై సుధాకర్ రెడ్డి మరణించారు. రాము అనే మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. అతడిని మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో రాయ్పుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు, కోబ్రా బలగాలు కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వారాంతపు సంత జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పొంచిఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. ఈ దాడి అనంతరం నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల కోసం సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు, కోబ్రా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయని తెలిపారు.
ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాల యువకులు
గత మంగళవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా సలాతోంగ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మోహల్లమాన్పూర్ జిల్లా బొగిటాల గ్రామ పరిసరాల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పది రోజుల వ్యవధిలో ఇది మూడో దాడి కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్