Vizag Kidnap case: ఎంపీ కుమారుడిని ఇంట్లో కట్టేసి కత్తితో బెదిరించారు: డీజీపీ
విశాఖపట్నం వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సతీమణి, కుమారుడు కిడ్నాప్ వివరాలను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
![](https://assets.eenadu.net/article_multiple_images/123106650_160623-APDGP-inner.jpg)
మంగళగిరి: విశాఖపట్నం వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సతీమణి, కుమారుడు కిడ్నాప్ వ్యవహారంలో నిందితులు రూ.1.75 కోట్ల నగదు వసూలు చేశారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వారి నుంచి ఇప్పటివరకు రూ.86.5 లక్షలు రికవరీ చేశామన్నారు. కిడ్నాప్ ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
‘‘ముగ్గురు నిందితులు ఎంపీ కుమారుడి ఇంట్లోకి వెళ్లి బెదిరించారు. ఎంపీ కుమారుడు శరత్ను ఇంట్లో కట్టేసి కత్తితో బెదిరించారు. మరుసటి రోజున ఎంపీ భార్య జ్యోతిని కుమారుడు శరత్తో పిలిపించి ఆమెను కూడా కట్టేశారు. ఆడిటర్ జీవీ వస్తే ఆయన్ను కూడా కట్టేసి బెదిరించారు. ఎంపీ కుమారుడి ఇంట్లో ఉన్న రూ.15లక్షలు తీసుకున్నారు. మరో రూ.60 లక్షలు ఖాతా నుంచి బదిలీ చేయించుకున్నారు. జీవీని కొట్టి బెదిరించి రూ.కోటి వరకు తెప్పించుకున్నారు’’ అని డీజీపీ వివరించారు.
ఇదీ చదవండి: విశాఖ ఎంపీ కుటుంబీకుల కిడ్నాప్
కిడ్నాప్ సమాచారం అందగానే పోలీసులు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. కిడ్నాపర్లు రుషికొండ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. అప్పటివరకు బాధితులను కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చారన్నారు. పోలీసులు వెంబడిస్తున్నట్లు తెలిసి ఎంపీ సతీమణి, కుమారుడు, అడిటర్ జీవీతో పాటు కారులో పరారయ్యేందుకు యత్నించారు. నిందితులు హేమంత్, రాజేశ్, సాయి ముగ్గురూ కలిసి కారులో తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఛేజ్ చేశారు. పద్మనాభం ప్రాంతంలో కిడ్నాపర్ల కారు మరమ్మతుకు గురవ్వడంతో కిడ్నాప్ చేసిన ముగ్గుర్నీ అక్కడే వదిలేసి పరారయ్యారని, పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలు సరిగా లేవని వస్తోన్న వార్తలపైనా డీజీపీ స్పందించారు. ఈ నేరఘటనను శాంతిభద్రతలకు ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత