Cyber Crime: కేంద్ర మాజీ మంత్రికి షాకిచ్చిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి ఖాతా నుంచి నగదు కొట్టేశారు.
చెన్నై: రోజుకో కొత్త పంథాలో ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవర్నీ సైబర్ నేరగాళ్లు విడిచిపెట్టడం లేదు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ (Dayanidhi Maran) వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి రూ. 99,999 నగదు కొట్టేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డిజిటల్ ఇండియాలో వ్యక్తిగత సమాచారం సురక్షితంగా లేదని చెబుతూ ఆయన మోసం జరిగిన తీరును వివరించారు. ఓటీపీ అవసరం లేకుండా, తన వ్యక్తిగత మొబైల్కు ఎలాంటి పేమెంట్ లింక్ రాకుండా సైబర్ నేరగాళ్లు నగదు కొట్టేశారని ట్వీట్లో పేర్కొన్నారు.
‘ఎక్కడికెళ్లినా బాంబుల మోతే..’ గాజాలో చిక్కుకున్న భారత కుటుంబం ఆవేదన
‘‘ఆదివారం నా వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి రూ.99,999 నగదును సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. నా భార్య జాయింట్ ఖాతాదారుగా ఉన్న యాక్సిస్ బ్యాంకు అకౌంట్ నుంచి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు బిల్ డెస్క్కు ఈ నగదు బదిలీ అయినట్లు విచారణలో గుర్తించారు. అయితే, నా ఫోన్ నంబర్కు ఎలాంటి ఓటీపీ, పేమెంట్ లింక్ రాలేదు. జాయింట్ ఖాతాదారుగా ఉన్న నా భార్య మొబైల్కు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి, నగదు లావాదేవీ గురించి విచారించారు. ఆ వెంటనే బ్యాంకు ఖాతానుంచి నగదు బదిలీ అయింది. దీంతో నేను నా బ్యాంకు ఖాతాను స్తంభింపజేశాను. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నా వ్యక్తిగత వివరాలు (ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా నంబర్) సైబర్ నేరగాళ్ల చేతికి ఎలా వెళ్లాయి? సైబర్ దాడి చేసిన వాళ్లు ఈ సమాచారం సేకరించారా? అనే దానిపై స్పష్టత లేదు. డిజిటల్ లావాదేవీలు, సైబర్ మోసాల గురించి అవగాహన కలిగిన మా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? ’’అని ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు పటిష్ఠ సైబర్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. 2020 జనవరి నుంచి 2023 జూన్ వరకు జరిగిన సైబర్ నేరాల్లో 75 శాతం నగదు లావాదేవీలకు సంబంధించనవే ఉన్నాయని దయానిధి మారన్ తెలిపారు. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ట్వీట్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్