Cyber Crime: కేంద్ర మాజీ మంత్రికి షాకిచ్చిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి ఖాతా నుంచి నగదు కొట్టేశారు.
చెన్నై: రోజుకో కొత్త పంథాలో ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవర్నీ సైబర్ నేరగాళ్లు విడిచిపెట్టడం లేదు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ (Dayanidhi Maran) వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి రూ. 99,999 నగదు కొట్టేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డిజిటల్ ఇండియాలో వ్యక్తిగత సమాచారం సురక్షితంగా లేదని చెబుతూ ఆయన మోసం జరిగిన తీరును వివరించారు. ఓటీపీ అవసరం లేకుండా, తన వ్యక్తిగత మొబైల్కు ఎలాంటి పేమెంట్ లింక్ రాకుండా సైబర్ నేరగాళ్లు నగదు కొట్టేశారని ట్వీట్లో పేర్కొన్నారు.
‘ఎక్కడికెళ్లినా బాంబుల మోతే..’ గాజాలో చిక్కుకున్న భారత కుటుంబం ఆవేదన
‘‘ఆదివారం నా వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి రూ.99,999 నగదును సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. నా భార్య జాయింట్ ఖాతాదారుగా ఉన్న యాక్సిస్ బ్యాంకు అకౌంట్ నుంచి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు బిల్ డెస్క్కు ఈ నగదు బదిలీ అయినట్లు విచారణలో గుర్తించారు. అయితే, నా ఫోన్ నంబర్కు ఎలాంటి ఓటీపీ, పేమెంట్ లింక్ రాలేదు. జాయింట్ ఖాతాదారుగా ఉన్న నా భార్య మొబైల్కు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి, నగదు లావాదేవీ గురించి విచారించారు. ఆ వెంటనే బ్యాంకు ఖాతానుంచి నగదు బదిలీ అయింది. దీంతో నేను నా బ్యాంకు ఖాతాను స్తంభింపజేశాను. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నా వ్యక్తిగత వివరాలు (ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా నంబర్) సైబర్ నేరగాళ్ల చేతికి ఎలా వెళ్లాయి? సైబర్ దాడి చేసిన వాళ్లు ఈ సమాచారం సేకరించారా? అనే దానిపై స్పష్టత లేదు. డిజిటల్ లావాదేవీలు, సైబర్ మోసాల గురించి అవగాహన కలిగిన మా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? ’’అని ప్రశ్నించారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు పటిష్ఠ సైబర్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. 2020 జనవరి నుంచి 2023 జూన్ వరకు జరిగిన సైబర్ నేరాల్లో 75 శాతం నగదు లావాదేవీలకు సంబంధించనవే ఉన్నాయని దయానిధి మారన్ తెలిపారు. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ట్వీట్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూశాఖ దస్త్రాల దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. -
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ