కలుషితాహారం తిని.. 70 మంది విద్యార్థినులకు అస్వస్థత
తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
వనపర్తి: తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహారం కలకలం రేపింది. రాత్రి తీసుకున్న భోజనం వికటించి 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ కేజీబీవీలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నిన్న రాత్రి వీరికి వంకాయ, సాంబారుతో కూడిన ఆహారాన్ని వడ్డించారు. రాత్రి భోజనం అయ్యాక 11 గంటల ప్రాంతంలో విద్యార్థినులకు కడుపునొప్పి ప్రారంభం కావడంతో ఒక్కొక్కరుగా సిబ్బంది దగ్గరకి వెళ్లారు. కేజీబీవీలో ఒక టీచర్, వాచ్మన్ మాత్రమే ఉండటంతో రాత్రి విద్యార్థినులకు బయటకి పంపలేదు. రాత్రంతా పరిస్థితి అలాగే ఉండటంతో.. తెల్లవారు జామున ఓ ప్రైవేటు ఆటో తీసుకొచ్చిన సిబ్బంది వారందర్నీ సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పిల్లలందరికీ వైద్యులు, సిబ్బంది హుటాహుటిన చికిత్స ప్రారంభించగా.. చాలా వరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. నలుగురు విద్యార్థులకు కడుపునొప్పి తగ్గకపోవడంతో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా ఆత్మకూరు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. తమ పిల్లల పరిస్థితి చూసి వారు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆహార కలుషితం జరిగిందా? ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. ప్రధానంగా 9, 10, ఇంటర్ విద్యార్థినులే అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారు. తొలుత 45 మందిని ఆ తర్వాత మరో 15 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆహారం విషతుల్యం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్ధినులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలం వెళ్తుండగా వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో ప్రమాదం జరిగింది. శ్రీశైలం వెళ్తున్న భక్తుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. -
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
పెంపుడు కుక్క విషయంలో గొడవ.. కుటుంబంపై దాడి
మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రహమత్నగర్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. -
బాలికలతో బలవంతపు వ్యభిచారం.. అరెస్టయిన వారిలో డీఎస్పీ
Prostitution racket: అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు సెక్స్ రాకెట్ను ఛేదించారు. మైనర్ బాలికలను రక్షించారు. ఐదుగురు ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్లకు మ్యూల్ ఖాతాలు.. బెంగళూరులో చిక్కిన ఖమ్మం వాసి
నిర్మల్ జిల్లా భైంసా వాసులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి.. వాటిని ఆన్లైన్ బెట్టింగ్లకు వినియోగించిన కేసులో కీలక నిందితుడు చిక్కాడు. -
అర్ధరాత్రి ఆరుగురు సజీవ దహనం
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఆరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి
గుజరాత్లోని నర్మదా నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరందరూ స్నానానికి వెళ్లగా ఈ దుర్ఘటన జరిగింది. -
సచిన్ ఇంటి సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఇంటి వద్ద భద్రతా విధులు నిర్వర్తించే గార్డు కాప్డే (39) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఓ అధికారి వెల్లడించారు. -
చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధ దంపతుల మృతి
వేగంగా వెళ్తూ అదుపు తప్పిన కారు.. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్న ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
కామారెడ్డి డీఎంహెచ్వో లైంగిక వేధింపులు.. ఏడు కేసుల నమోదు
కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డి.లక్ష్మణ్సింగ్పై వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్రావు బుధవారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్