Blast in factory: పరిశ్రమలో రియాక్టర్ పేలి ఏడుగురి మృతి.. 50 మందికి పైగా గాయాలు
రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ఏడుగురు మృతి చెందిన ఘటన ఠానేలో చోటుచేసుకుంది.
ఠానే: మహారాష్ట్రలోని ఠానేలో ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 56 మందికి గాయాలయ్యాయి. డోంబివిలి ఎంఐడీసీ ఫేజ్ -2 ప్రాంతంలోని అముదాన్ కెమికల్ కంపెనీలో ఈ మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో రియాక్టర్ పేలడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఏడు మృతదేహాలను గుర్తించగా.. ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు కారణంగా పెద్దఎత్తున చెలరేగిన మంటల ప్రభావం ఆ ప్రాంతంలో కనీసం ఐదు కంపెనీలపై పడినట్లు తెలిపారు. ఈ పేలుడు ధాటికి దాదాపు కి.మీ. మేర శబ్దం వినిపించినట్లు ప్రత్యక్షసాక్షి చెప్పారు. పక్కనే ఉన్న భవనాల అద్దాలకు పగుళ్లు రాగా.. పరిసరాల్లోని పలు ఇళ్లు సైతం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
బెంగళూరు రేవ్ పార్టీ.. తెలుగు నటికి డ్రగ్ పాజిటివ్: పోలీసులు
ముంబయికి 40 కి.మీ.ల దూరంలో ఉన్న మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ (MIDC) ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా.. పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్, ఎంపీ శ్రీకాంత్ శిందే, ఎమ్మెల్యే రాజు పాటిల్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై సీఎం ఏక్నాథ్ శిందే స్పందించారని.. క్షతగాత్రులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చినట్లు మంత్రి సమంత్ విలేకర్లకు వెల్లడించారు. బాధితులకు వారం రోజుల్లోగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం