వృద్ధురాలిపై అత్యాచారం
ఇంటి వరండాలో నిద్రిస్తున్న వృద్ధ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితురాలి చెవి కమ్మలూ ఎత్తుకెళ్లాడు.
పెదనందిపాడు, న్యూస్టుడే: ఇంటి వరండాలో నిద్రిస్తున్న వృద్ధ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితురాలి చెవి కమ్మలూ ఎత్తుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... 85 ఏళ్ల మహిళ శుక్రవారం రాత్రి తన ఇంటి వరండాలో పడుకున్నారు. అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని వ్యక్తి వచ్చి చీకట్లో ఆమె నోరు నొక్కి అత్యాచారం చేశాడు. ఆపై చెవి కమ్మలు తీసుకొని పరారయ్యాడు. బాధితురాలు ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు, కోడలిని నిద్రలేపి విషయం చెప్పి కన్నీరు మున్నీరయ్యారు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై అబ్దుల్ రెహమాన్ శనివారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన కేసుల్లో కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డి.లక్ష్మణ్సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. -
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
తెలంగాణలో ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు. -
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
హైదరాబాద్లో ఓ యువతికి అనుమానాస్పద స్థితిలో గాయాలు కావడం కలకలం రేపింది. -
శ్రీశైలం వెళ్తుండగా వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో ప్రమాదం జరిగింది. శ్రీశైలం వెళ్తున్న భక్తుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. -
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
పెంపుడు కుక్క విషయంలో గొడవ.. కుటుంబంపై దాడి
మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రహమత్నగర్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. -
బాలికలతో బలవంతపు వ్యభిచారం.. అరెస్టయిన వారిలో డీఎస్పీ
Prostitution racket: అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు సెక్స్ రాకెట్ను ఛేదించారు. మైనర్ బాలికలను రక్షించారు. ఐదుగురు ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్లకు మ్యూల్ ఖాతాలు.. బెంగళూరులో చిక్కిన ఖమ్మం వాసి
నిర్మల్ జిల్లా భైంసా వాసులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి.. వాటిని ఆన్లైన్ బెట్టింగ్లకు వినియోగించిన కేసులో కీలక నిందితుడు చిక్కాడు. -
అర్ధరాత్రి ఆరుగురు సజీవ దహనం
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఆరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి
గుజరాత్లోని నర్మదా నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరందరూ స్నానానికి వెళ్లగా ఈ దుర్ఘటన జరిగింది. -
సచిన్ ఇంటి సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఇంటి వద్ద భద్రతా విధులు నిర్వర్తించే గార్డు కాప్డే (39) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఓ అధికారి వెల్లడించారు. -
చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధ దంపతుల మృతి
వేగంగా వెళ్తూ అదుపు తప్పిన కారు.. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్న ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
కామారెడ్డి డీఎంహెచ్వో లైంగిక వేధింపులు.. ఏడు కేసుల నమోదు
కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డి.లక్ష్మణ్సింగ్పై వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్రావు బుధవారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM