వృద్ధురాలిపై అత్యాచారం

ఇంటి వరండాలో నిద్రిస్తున్న వృద్ధ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితురాలి చెవి కమ్మలూ ఎత్తుకెళ్లాడు.

Published : 30 Jul 2023 04:32 IST

పెదనందిపాడు, న్యూస్‌టుడే: ఇంటి వరండాలో నిద్రిస్తున్న వృద్ధ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితురాలి చెవి కమ్మలూ ఎత్తుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... 85 ఏళ్ల మహిళ శుక్రవారం రాత్రి తన ఇంటి వరండాలో పడుకున్నారు. అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని వ్యక్తి వచ్చి చీకట్లో ఆమె నోరు నొక్కి అత్యాచారం చేశాడు. ఆపై చెవి కమ్మలు తీసుకొని పరారయ్యాడు. బాధితురాలు ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు, కోడలిని నిద్రలేపి విషయం చెప్పి కన్నీరు మున్నీరయ్యారు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై అబ్దుల్‌ రెహమాన్‌ శనివారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని