Akividu: కట్టుకున్నోడే కాలయముడై.. నడిరోడ్డుపై భార్యను పొడిచి చంపిన భర్త
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కాలయముడై భార్యను కిరాతకంగా హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది.
ఆకివీడు, న్యూస్టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కాలయముడై భార్యను కిరాతకంగా హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆకివీడు 14వ వార్డులో నివసిస్తున్న మారడుగుల వీరవెంకట సత్యనారాయణ పెద్ద కుమార్తె సాయిలక్ష్మి కమల సంధ్య (సంధ్యారాణి) అదే ప్రాంతానికి చెందిన వాడపల్లి రాంబాబును ప్రేమించి మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వారికి 18 నెలల బాబు ఉన్నాడు. రాంబాబు గొలుసు చోరీ కేసులో జైలుకు వెళ్లడంతో సంధ్యారాణి(24) కుమారుడితో సహా పుట్టింటికి వచ్చేసి విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన రాంబాబు భార్యతో గొడవపడి బిడ్డను తనకు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె శనివారం ఉదయం తండ్రితో కలిసి స్థానిక భీమేశ్వరస్వామి ఆలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా భర్త రాంబాబు అడ్డుకొని నడిరోడ్డుపైనే చాకుతో విచక్షణా రహితంగా పొడిచాడు. సమీపాన ఉన్న ఆమె తండ్రి ఈ ఘటనను చూసి దగ్గరకు వచ్చేసరికి రాంబాబు పారిపోయాడు. తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా అప్పటికే మృతి చెందినట్లు 108 అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు. రాంబాబు ఆకివీడు పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు తెలియడంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని అక్కడికి తరలించి ఆందోళనకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆందోళన కొనసాగగా ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ శ్రీనాథ్లు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుటుంబాన్ని పగబట్టిన విధి!
ఎన్నికల విధులకు కుమారుడితో కలిసి వెళ్లిన మహిళను రైలు ఢీకొట్టింది. -
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం దుర్మరణం
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పురపాలిక పరిధి శేర్పల్లి(బి) వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం(42) దుర్మరణం పాలయ్యారు. -
బెట్టింగ్కు బానిసైన కుమారుడి హత్య..
క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడిన యువకుడు రూ.కోట్లలో అప్పు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశాడనే ఆక్రోశంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. -
ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంకు పేలి.. 10 మందికి గాయాలు
ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంకు పేలుడు హైదరాబాద్లోని పాతబస్తీ భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధి తలాబ్కట్టలో విధ్వంసం సృష్టించింది. -
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి హఠాన్మరణం
ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్బూత్కు వచ్చిన ఓ ప్రిసైడింగ్ అధికారి(పీవో) గుండెపోటుతో మృతి చెందారు. -
తెదేపా నేత అనుమానాస్పద మృతి
పల్నాడు జిల్లా గురజాల మండలం బూదవాడ గ్రామానికి చెందిన తెదేపా నేత దాసరి బ్రహ్మయ్య (33) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. -
ఏనుగు దాడిలో వ్యక్తి మృతి
జిల్లాలో ఏనుగుల సంచారం ఇటీవల పెరిగిపోయింది. -
తెదేపాలో చేరారని న్యాయవాది కారు దహనం
తెదేపాలో చేరారని న్యాయవాది కారుని వైకాపా నాయకులు దహనం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
కారులో కోటిన్నర వదిలేసి డ్రైవర్ పరారీ
ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న విశాఖపట్నం పోలీసులు ఓ కారులోని రూ.1.50 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.