Mancherial: మేక పోయిందని.. మానవత్వం మరచి..
మేక ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఓ కుటుంబం పశువుల కాపరితోపాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసింది.. ఆపై తల కింద పొగబెట్టి చిత్రహింసలకు గురి చేసింది.
ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడదీసి, కింద పొగబెట్టి చిత్రహింసలు
మంచిర్యాల జిల్లాలో ఓ కుటుంబం అమానుష చర్య
మందమర్రి పట్టణం, న్యూస్టుడే: మేక ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఓ కుటుంబం పశువుల కాపరితోపాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసింది.. ఆపై తల కింద పొగబెట్టి చిత్రహింసలకు గురి చేసింది. ఈ అమానవీయ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, కొడుకు శ్రీనివాస్ అంగడిబజార్ ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరు పట్టణ శివారులోని గంగనీళ్ల పంపుల సమీపంలో షెడ్డు వేసి మేకలు పెంచుతున్నారు. తేజ(19) అనే యువకుడు వీరి ఇంట్లోనే ఉంటూ పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. అతని తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుండగా.. తండ్రి లేరు. సుమారు 20 రోజుల క్రితం మంద నుంచి ఒక మేక, ఇనుప రాడ్డు కనిపించకుండా పోయాయి. తేజతోపాటు అతని స్నేహితుడైన దళిత యువకుడు చిలుముల కిరణ్(30)లపై అనుమానం వచ్చిన యజమాని కుటుంబసభ్యులు శుక్రవారం ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు. వారిని కొట్టి.. కాళ్లకు తాళ్లు కట్టి.. తలకిందులుగా వేలాడదీశారు. కింద పొగ పెట్టి ఊపిరాడకుండా చేశారు. అనంతరం ఇద్దరినీ విడిచిపెట్టారు.
ఆచూకీ లేని కిరణ్
రామగుండానికి చెందిన కిరణ్ తల్లిదండ్రులు చనిపోవడంతో మందమర్రి పట్టణంలోని అబ్రహంనగర్లో ఉండే చిన్నమ్మ సరిత ఇంటి వద్ద ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో సరిత ఆందోళన చెందారు. ఈ క్రమంలో కిరణ్ను కట్టేసి కొట్టిన ఫొటోలు బయటకు రావడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాములు, శ్రీనివాస్, స్వరూపతో పాటు వారి వద్ద పనిచేస్తున్న నరేశ్పై ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, ఎస్సై చంద్రకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM