గ్రూప్-2 అభ్యర్థిని ఆత్మహత్య
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఒక అభ్యర్థిని ఆత్మహత్యకు పాల్పడటం హైదరాబాద్లోని అశోక్నగర్లో కలకలం రేపింది. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
హాస్టల్లో ఉరి వేసుకుని..
పరీక్ష వాయిదా వల్లే.. అంటూ ఇతర అభ్యర్థుల నిరసన
రాంనగర్, గాంధీనగర్, న్యూస్టుడే: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఒక అభ్యర్థిని ఆత్మహత్యకు పాల్పడటం హైదరాబాద్లోని అశోక్నగర్లో కలకలం రేపింది. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా... అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న అభ్యర్థులు అడ్డుకున్నారు. పరీక్ష వాయిదా పడడం వల్లే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్ధరాత్రి వరకు మృతదేహం హాస్టల్లోనే ఉంది. భాజపా ఎంపీ లక్ష్మణ్, ఆ పార్టీ నాయకురాలు బండారు విజయలక్ష్మి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు.
‘నా వల్ల మీకు ఎప్పుడూ బాధే’
ప్రవళిక రాసిన సూసైడ్ నోట్గా చెబుతున్న లేఖ వాట్సాప్ గ్రూప్లో చక్కర్లు కొట్టింది. ‘నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు.. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా.. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా.. నాన్న జాగ్రత్త!’ అంటూ ఆ లేఖలో ఉంది.
అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత
మర్రి ప్రవళిక కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. ఆధార్ కార్డుపై వివరాల ప్రకారం తండ్రి లింగయ్య అని ఉంది. ఆమె కుటుంబానికి న్యాయం చేసేవరకు కదలబోమని గ్రూప్స్ అభ్యర్థులు రహదారిపై అర్ధరాత్రి నిరసనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. సెంట్రల్జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ట్రాఫిక్ను మళ్లించి.. అభ్యర్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. క్రైమ్స్ అండ్ సిట్ సంయుక్త పోలీసు కమిషనర్ గజరావు భూపాల్, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ రత్నం అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇన్స్పెక్టర్ నరేశ్ దర్యాప్తు చేస్తున్నారు.
అర్ధరాత్రి దాటాక ప్రవళిక మృతదేహం తరలింపు
ఈనాడు, హైదరాబాద్: ఆందోళనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత లాఠీఛార్జి చేశారు. దాంతో అభ్యర్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాత్రి 1.30 ప్రాంతంలో ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగిన సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సీఆర్పీఎఫ్ దళాలను పోలీసులు రంగంలోకి దించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
Crime: ఓ దొంగ తన చేతివాటం ప్రదర్శించేందుకు ఏకంగా విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకున్నాడు. అత్యంత భద్రత ఉండే విమానాశ్రయాల నుంచి ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకు తిరిగాడు. -
ఓటేసేందుకు వచ్చి.. మృత్యుఒడికి చేరి
ఓటుహక్కు వినియోగించుకునేందుకు యువత నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపారు. -
ఓటేయడానికి వెళుతూ.. కుమారుడు సహా దంపతుల మృత్యువాత
హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు సొంతూరు వెళుతున్న దంపతులు, ఎనిమిదేళ్ల వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రహదారి పక్కన మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద వీరు అల్పాహారం తింటుండగా.. -
ఎన్నికల విధుల్లో ఇద్దరు ఉద్యోగుల మృతి
వేర్వేరు ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం ఒకరు చనిపోగా, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఆదివారం రాత్రి మరొకరు మృతిచెందారు. -
ఇద్దరు వృద్ధుల దుర్మరణం
వేర్వేరు గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్తూ ఇద్దరు వృద్ధురాళ్లు మృతిచెందారు. ఒకరు ఓటు వేయకుండానే.. మరొకరు ఓటు వేశాక మరణించారు. -
ఐఈడీ బాంబులు పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు బాలురు మృతి చెందారు. -
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రగఢ్ కత్రన్గట్ట అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
-
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
-
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
-
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
-
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
-
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు