East Godavari: సినీఫక్కీలో బస్సును వెంబడించి.. ఆర్టీసీ డ్రైవర్పై దాడి
నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై మూకుమ్మడి దాడి మరవక ముందే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఓ ఆర్టీసీ డ్రైవర్పై పలువురు దాడి చేశారు.
నిడదవోలు, న్యూస్టుడే: నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై మూకుమ్మడి దాడి మరవక ముందే తూర్పుగోదావరి జిల్లా(East Godavari) నిడదవోలులో ఓ ఆర్టీసీ డ్రైవర్పై పలువురు దాడి చేశారు. తాడేపల్లిగూడెం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం నుంచి నిడదవోలు మీదుగా తాడేపల్లిగూడెం బయలుదేరింది. రాజమహేంద్రవరం షెల్టన్ హోటల్ దగ్గరకు వచ్చేసరికి స్థానికుడైన సువ్వాడ గోవిందరాజు ద్విచక్రవాహనంపై బస్సుకు అడ్డంగా వచ్చారు. ఆర్టీసీ డ్రైవర్ గూడవల్లి ధనశంకర నాగరాజు బస్సును ఆపి, అంత కంగారు ఎందుకంటూ అతణ్ని ప్రశ్నించారు. మాటామాటా పెరగడంతో గోవిందరాజు డ్రైవర్పైకి కంకరరాయి విసిరాడు. చుట్టుపక్కలవాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో బస్సు వెళ్లిపోయింది. అయితే గోవిందరాజుతో పాటు మరికొందరు సినీఫక్కీలో బస్సును వెంబడించారు. నిడదవోలు గణపతి సెంటర్కు వచ్చేసరికి రోడ్డుకు అడ్డంగా జీపు పెట్టారు. డ్రైవర్ను కాలర్ పట్టుకుని కిందకు లాగి, రాడ్తో తలపైన, ఎడమ కాలిపై కొట్టారు. తనను దుర్భాషలాడి, దాడి చేశారంటూ డ్రైవర్ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరానికి చెందిన సువ్వాడ గోవిందరాజు, సువ్వాడ భార్గవ్, మజ్జి ప్రవీణ్, నిడదవోలుకు చెందిన మహమ్మద్ మున్నావర్లపై కేసు నమోదు చేసినట్లు నిడదవోలు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. -
ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్సై హత్య
ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్సైను ట్రాక్టరుతో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీల మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. -
ఉద్యోగం రాదన్న బెంగతో యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదన్న బెంగతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో చోటుచేసుకుంది. -
అబ్బాయిలతో ఫోను మాట్లాడొద్దని మందలించినందుకు.. అన్నయ్య ప్రాణాలు తీసిన చెల్లి
అబ్బాయిలతో మొబైల్ ఫోన్లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి హత్య చేసింది. -
‘స్టాక్ ట్రేడింగ్’.. మోసాలు లోడింగ్!
‘స్టాక్ ట్రేడింగ్’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు. -
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
తన ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే ఓ నదిలో విసిరేసిందో తల్లి. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా