సీనియర్ ఐఏఎస్ విచారణకు సన్నద్ధం!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఉదంతంలో అనిశా కీలక నిర్ణయం తీసుకుంది.
శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంతో అనిశా దూకుడు
ఈనాడు, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఉదంతంలో అనిశా కీలక నిర్ణయం తీసుకుంది. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో తన వాటాదారుగా పేర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు సిద్ధమైంది. అయితే ఆయన్ను తొలుత సాక్షిగా మాత్రమే పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 160 సీఆర్పీసీ నోటీసు ఇచ్చే యోచనలో ఉంది. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో సదరు ఐఏఎస్ గురించి పలు అంశాలు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పలు వివాదాస్పద భూములకు అనుమతులు ఇప్పించినందుకు ఇద్దరికీ భారీగా లబ్ధి చేకూరిందని అంగీకరించాడు. ఆ డబ్బులతో కొనుగోలు చేసిన భూములు, ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు వంటి వివరాలను వెల్లడించాడు. తాను స్వయంగా ఐఏఎస్ ఇంటికెళ్లి కొంత డబ్బు ఇచ్చినట్లు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకొంది. అనిశా ఈ విషయాలన్నింటినీ న్యాయస్థానానికి ఇప్పటికే సమర్పించింది. అయితే ఈ వాంగ్మూలంతో ఐఏఎస్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించే అవకాశం లేదు. అందుకు తగిన ఆధారాలను సంపాదించి నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఆయా ఒప్పందాలు జరిగిన సమయంలో శివబాలకృష్ణ, ఐఏఎస్ల మధ్య ఫోన్కాల్స్, వాట్సప్ సంభాషణలతోపాటు ఇద్దరి ఫోన్ లొకేషన్లకు సంబంధించి సెల్టవర్ డేటాను సేకరించాలి. దీనికి మరికొంత సమయం పట్టనుండటంతో తొలుత ఆయన్ను సాక్షిగా పిలిచి విచారించాలని అనిశా యోచిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో నోటీసు జారీ చేయాలని భావిస్తోంది. ఐఏఎస్ వాటాలు తీసుకున్నట్లు నిర్ధారణైతే 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసి మళ్లీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన్ను అరెస్టు చేయాల్సి వస్తే ప్రభుత్వం నుంచి అనుమతి కోరే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్