రాడిసన్ డ్రగ్స్ కేసులో గోవా లింకు
హైదరాబాద్ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గోవా లింకు లభించింది.
ప్రధాన సూత్రధారి అక్కడి జైలులో ఉండే అబ్దుల్
అతని నుంచి అబ్దుల్ రెహ్మాన్కు.., ఆపై మీర్జా వహీద్ బేగ్, అబ్బాస్, వివేకానంద్లకు
ఈనాడు- హైదరాబాద్, మాదాపూర్, న్యూస్టుడే: హైదరాబాద్ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గోవా లింకు లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మంజీరా గ్రూపు సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్కు డ్రగ్స్ ఎక్కడి నుంచి అందుతున్నాయని కూపీలాగే క్రమంలో గోవాలోని ఒక జైలులో విచారణ ఖైదీగా ఉన్న అబ్దుల్ అనే డ్రగ్స్ నెట్వర్క్ కింగ్పిన్ గురించి తెలిసింది. అతని ఆదేశాలతోనే హైదరాబాద్లోని రాణిగంజ్కు చెందిన అబ్దుల్ రెహ్మాన్కు భారీగా కొకైన్ అందుతోందని, అతడి నుంచి అత్తాపూర్లోని కేఫ్ రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేస్తున్న మీర్జా వహీద్ బేగ్కు, ఆ తర్వాత సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీకి చేరుతున్నట్లు తెలిసింది. వివేకానంద్ అబ్బాస్ ద్వారా కొనుగోలు చేసి పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రెహ్మాన్పై హైదరాబాద్లో పలు డ్రగ్స్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఫిబ్రవరిలోనే పదిసార్లు కొనుగోలు
వివేకానంద్ ఒక్క ఫిబ్రవరిలోనే పదిసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు సంబంధించి నగదు లావాదేవీలు ఇతర చెల్లింపుల రికార్డుల్ని గుర్తించారు. అబ్బాస్ నుంచి ఫిబ్రవరి 16, 17 తేదీల్లో 2 గ్రాములు చొప్పున, 18, 19 తేదీల్లో ఒక గ్రాము చొప్పున కొన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటినే 24న నిర్వహించిన పార్టీలో తన స్నేహితులతో కలిసి వినియోగించినట్లు వెల్లడైంది. అతడి ఫోన్ కాల్స్, వాట్సప్ చాటింగులు, నగదు లావాదేవీల వివరాలను తనిఖీ చేస్తున్నారు. ఈ పార్టీలకు ప్రస్తుత ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వారే కాకుండా.. ఇంకా ఎవరైనా వస్తున్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
చేతులు మారుతోందిలా..
వివేకానంద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అబ్బాస్కు.. యాకుత్పురకు చెందిన మీర్జా వహీద్ బేగ్ ద్వారా అందుతున్నట్లు తేలింది. మీర్జా వహీద్కు రాణిగంజ్కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ ఓ స్నేహితుడి ద్వారా పరిచయమయ్యాడు. స్నాప్చాట్ ద్వారా అతనితో చాటింగ్ చేసేవాడు. ఆ పరిచయంతో రెహ్మాన్ నుంచి కొకైన్ కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఏడాది క్రితం మీర్జా వహీద్తో సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీకి పరిచయం ఏర్పడింది. అనంతరం అతని నుంచి డ్రగ్స్ తీసుకొని వివేకానంద్కు ఇచ్చేవాడు. ఒక్కో గ్రాము రూ.14 వేలకు అమ్మేవాడు. తాజాగా రెహ్మాన్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని లింకులు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు. మీర్జా వహీద్ను కూడా కస్టడీకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు.
క్రిష్, రఘుచరణ్లకు నెగెటివ్
ఈ కేసులో నిందితులుగా ఉన్న సినీ దర్శకుడు క్రిష్, రఘుచరణ్ మూత్ర నమూనాలను విశ్లేషించగా ఫలితాలు నెగెటివ్(డ్రగ్స్ తీసుకోనట్లు)గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రక్త నమూనాల ఫలితాలు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇంకా పెండింగ్లో ఉన్నాయి. స్నేహితుడైన రఘుచరణ్ ఆహ్వానం మేరకు రాడిసన్ హోటల్ వెళ్లానని, అక్కడ అరగంట మాత్రమే ఉన్నానని, డ్రగ్స్ తీసుకోలేదని క్రిష్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు సందీప్, లిషి, శ్వేతల కోసం గాలింపు కొనసాగుతోంది. మరో నిందితుడు నీల్ అమెరికా పారిపోయాడని, అతనికి ఆ దేశ పౌరసత్వం ఉందని సమాచారం. అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు నోటీసుల నేపథ్యంలో శ్వేత తల్లి గచ్చిబౌలి పోలీసుల్ని కలిశారు. తన కూతురు ఇంట్లో లేదని, రాగానే విచారణకు తీసుకొస్తానని సమాధానమిచ్చారు. మరోవైపు రాడిసన్ హోటల్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతానికి హోటల్ ఎవరు నిర్వహిస్తున్నారో స్పష్టత రాకపోవడంతో నోటీసులిచ్చామని, తేలిన తరువాత కేసు నమోదు చేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ