సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
నలుగురి అరెస్టు
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మాజీ మంత్రి హరీశ్రావు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన నరేశ్కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దగ్గర సహాయకుడిగా పనిచేసిన కొర్లపాటి వంశీ, అసెంబ్లీలో అటెండర్గా పనిచేసే బాలగోని వెంకటేశ్, గోదావరిఖనికి చెందిన పులిపాక ఓంకార్ ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెదక్ జిల్లా పీర్లతండాకు చెందిన పి.రవినాయక్ తన భార్య చికిత్స ఖర్చుల కోసం జనవరి 2023లో హరీశ్రావు క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా సాయం అందకపోవడంతో ఆయన సచివాలయానికి వెళ్లి ఆరా తీశారు. రూ.50 వేలు, రూ.37,500ల చొప్పున రెండు చెక్కులు మంజూరైనట్లు తెలుసుకున్నారు. వాటిని నరేశ్కుమార్కు అప్పగించినట్లు తెలుసుకొని.. అతడ్ని పలుమార్లు కలిసినా స్పందనలేదు. నరేశ్.. ఆ చెక్కుల్ని వెంకటేశ్, కొర్లపాటి వంశీ, ఓంకార్లతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 5లోని ఎస్బీఐ నుంచి డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ నెల 21న రవినాయక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నరేశ్కుమార్, వెంకటేశ్, వంశీ, ఓంకార్లను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. శాసనసభ ఎన్నికల కోడ్ సమయానికి హరీశ్రావు కార్యాలయానికి దాదాపు 250కుపైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చాయి. వీటిని తిరిగి సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలోనే అప్పగించాలని హరీశ్రావు సూచించినా.. నరేశ్కుమార్ పట్టించుకోలేదని పోలీసులు గుర్తించారు. 19 చెక్కులు డ్రా చేసుకొని.. సుమారు 200 చెక్కులు దహనం చేసినట్లు విచారణలో తేలింది. చెక్కులు తీసుకోవడానికి ముందుకు రాని వారిని లక్ష్యంగా చేసుకుని.. అదే పేర్లతో ఉండే నకిలీ వ్యక్తులను బ్యాంకులకు తీసుకెళ్లి నిందితులు మోసానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.
నరేశ్తో మాకు సంబంధం లేదు: హరీశ్రావు కార్యాలయం
నరేశ్కుమార్ అనే వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధం లేదని హరీశ్రావు కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘మంత్రిగా హరీశ్రావు పదవీకాలం పూర్తయిన తర్వాత నరేశ్ ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. నరేశ్ మీద డిసెంబరు 17న నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేశాం. నరేశ్తో హరీశ్రావుకు, ఆయన కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని మాజీ మంత్రి కార్యాలయం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!