సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
నలుగురి అరెస్టు
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మాజీ మంత్రి హరీశ్రావు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన నరేశ్కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దగ్గర సహాయకుడిగా పనిచేసిన కొర్లపాటి వంశీ, అసెంబ్లీలో అటెండర్గా పనిచేసే బాలగోని వెంకటేశ్, గోదావరిఖనికి చెందిన పులిపాక ఓంకార్ ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెదక్ జిల్లా పీర్లతండాకు చెందిన పి.రవినాయక్ తన భార్య చికిత్స ఖర్చుల కోసం జనవరి 2023లో హరీశ్రావు క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా సాయం అందకపోవడంతో ఆయన సచివాలయానికి వెళ్లి ఆరా తీశారు. రూ.50 వేలు, రూ.37,500ల చొప్పున రెండు చెక్కులు మంజూరైనట్లు తెలుసుకున్నారు. వాటిని నరేశ్కుమార్కు అప్పగించినట్లు తెలుసుకొని.. అతడ్ని పలుమార్లు కలిసినా స్పందనలేదు. నరేశ్.. ఆ చెక్కుల్ని వెంకటేశ్, కొర్లపాటి వంశీ, ఓంకార్లతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 5లోని ఎస్బీఐ నుంచి డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ నెల 21న రవినాయక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నరేశ్కుమార్, వెంకటేశ్, వంశీ, ఓంకార్లను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. శాసనసభ ఎన్నికల కోడ్ సమయానికి హరీశ్రావు కార్యాలయానికి దాదాపు 250కుపైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చాయి. వీటిని తిరిగి సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలోనే అప్పగించాలని హరీశ్రావు సూచించినా.. నరేశ్కుమార్ పట్టించుకోలేదని పోలీసులు గుర్తించారు. 19 చెక్కులు డ్రా చేసుకొని.. సుమారు 200 చెక్కులు దహనం చేసినట్లు విచారణలో తేలింది. చెక్కులు తీసుకోవడానికి ముందుకు రాని వారిని లక్ష్యంగా చేసుకుని.. అదే పేర్లతో ఉండే నకిలీ వ్యక్తులను బ్యాంకులకు తీసుకెళ్లి నిందితులు మోసానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.
నరేశ్తో మాకు సంబంధం లేదు: హరీశ్రావు కార్యాలయం
నరేశ్కుమార్ అనే వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధం లేదని హరీశ్రావు కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘మంత్రిగా హరీశ్రావు పదవీకాలం పూర్తయిన తర్వాత నరేశ్ ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. నరేశ్ మీద డిసెంబరు 17న నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేశాం. నరేశ్తో హరీశ్రావుకు, ఆయన కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని మాజీ మంత్రి కార్యాలయం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!