రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు.
మొత్తం రూ.524 కోట్లు స్వాహా చేసినట్లు ఈడీ అంచనా
ఈనాడు, హైదరాబాద్: పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. ఈ మేరకు ఈడీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కమీషన్ పేరిట తమను మోసం చేశారంటూ పలువురు నిరుద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఇదే తరహా మోసం దేశవ్యాప్తంగా జరిగిందని, దాదాపు 50 కేసులు నమోదైనట్లు గుర్తించారు. దాదాపు రూ.524 కోట్ల మోసం జరిగి ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
లింకులు పంపి.. ఉచ్చులోకి దింపి
సైబర్ నేరగాళ్లు వాట్సప్, టెలిగ్రాంల వంటి యాప్ల ద్వారా ఉపాధి పేరిట నిరుద్యోగులకు గాలం వేసేవారు. రేటింగ్ ఇవ్వడం ద్వారా రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఆదాయం పొందవచ్చని పేర్కొనేవారు. స్పందించినవారికి లింకులు పంపేవారు. అందులో బ్యాంకు సహా వ్యక్తిగత వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. నమ్మకం కలిగించేందుకు కమీషన్ కింద ఖాతాల్లో కొంత డబ్బు జమచేసేవారు. ఉచ్చులో పడ్డ తర్వాత ఆదాయం పొందాలంటే కొంత డబ్బు డిపాజిట్ చేయాలని నిబంధన పెట్టేవారు. ప్రత్యేక వ్యాలెట్లు ఏర్పాటు చేసేవారు. రేటింగులు ఇస్తున్న కొద్దీ డబ్బు ఈ వ్యాలెట్లో జమయ్యేది. ఉపసంహరించుకునేందుకు వీలుండేది కాదు. అడిగితే ప్రాసెసింగ్ ఫీజుల కింద మరికొంత జమ చేయించుకునేవారు. ఆ తర్వాత జవాబు చెప్పడం మానేయడంతోపాటు వీరి వ్యాలెట్లో ఉన్న డబ్బు కూడా మాయమయ్యేది. ఈ కుంభకోణానికి సూత్రధారి యూఏఈలో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. తప్పుడు పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచారని, డబ్బు జమ అయిన తర్వాత కొన్ని ఖాతాలు ఒక్క రోజులో, మరికొన్నింటిని 15 రోజుల లోపే మూసివేశారని తేల్చారు. ఇలా తొలుత 175 ఖాతాల్లోకి జమైన నగదును 480 ఖాతాల్లోకి మళ్లించి, అక్కడ నుంచి క్రిప్టో కరెన్సీగా మార్చడంతోపాటు హవాలా రూపంలో తరలించారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశాలకు తరలించగా మిగిలిన డబ్బును ఈడీ ప్రాథమిక జప్తు చేసింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
రుణం దారిమళ్లించిన కేసులో రూ.70 లక్షల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్న కేసులో హైదరాబాద్ ఈడీ అధికారులు రూ.70 లక్షలను జప్తు చేశారు. జస్లీన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ యూనియన్ బ్యాంక్ నుంచి రూ.12 కోట్ల రుణం తీసుకుంది. ఈ డబ్బును సోదర సంస్థలతోపాటు వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించింది. దీనిపై తొలుత సీబీఐ, అనంతరం ఈడీ కేసులు నమోదు చేశాయి. జస్లీన్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామి, అమ్రిక్ ఫర్నిచర్స్ లిమిటెడ్ ఎండీ రణ్బీర్సింగ్ గాంధీ దీనికి బాధ్యుడిగా సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. రుణం కూడా తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి తీసుకున్నట్లు తేలింది. రణ్బీర్సింగ్ తన బంధువులు, మిత్రుల పేర్లతో సంస్థలు ఏర్పాటు చేయించి రుణం ద్వారా పొందిన డబ్బు వారి ఖాతాల్లోకి, తన భార్య ఖాతాలోకి మళ్లించినట్లు కూడా గుర్తించారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో రణ్బీర్సింగ్ యూనియన్ బ్యాంక్కు వన్టైం సెటిల్మెంట్ కింద రూ.11.30 కోట్లు చెల్లించాడు. నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఆయా ఖాతాల్లో మిగిలి ఉన్న రూ.70 లక్షలను బ్యాంకుకు వచ్చిన నష్టంగానే పరిగణించి ఈ మొత్తాన్ని జప్తు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి