రెచ్చిపోయిన ఇసుక మాఫియా
వైకాపా నాయకుల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ తవ్వకాల వల్ల బోర్లు ఎండిపోతున్నాయంటూ అడ్డు చెప్పిన గ్రామస్థులపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు.
తవ్వకాలు వద్దన్నందుకు ఇనుప రాడ్లతో దాడి
గ్రామస్థులపై ట్రాక్టర్ ఎక్కించి హతమార్చేందుకు యత్నం
ద్విచక్ర వాహనాల ధ్వంసం
మున్నంగి రీచ్లో వైకాపా కార్యకర్తల అరాచకం
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-కొల్లిపర: వైకాపా నాయకుల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ తవ్వకాల వల్ల బోర్లు ఎండిపోతున్నాయంటూ అడ్డు చెప్పిన గ్రామస్థులపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా వారిపై ట్రాక్టర్ ఎక్కించి హతమార్చేందుకు యత్నించారు. గ్రామస్థుల ద్విచక్ర వాహనాలను సైతం ట్రాక్టరుతో తొక్కించి ధ్వంసం చేశారు. కరకట్టపై కొద్దిసేపు భయానక వాతావరణం సృష్టించారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి రీచ్లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీనివెనుక స్థానికంగా ఇసుక మాఫియా నడిపిస్తున్న ముఖ్య నాయకుడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మున్నంగి రీచ్లో కొన్నాళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు.
దీంతో భూగర్భ జలాలు అడుగంటి, బోరుబావులు ఎండిపోతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతూ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు ట్రాక్టర్లలో శుక్రవారం సాయంత్రం ఇసుకను తరలిస్తుండడంతో అడ్డుకున్నారు. దీంతో వారు రాడ్లు, కర్రలతో దాడి చేశారు. గ్రామస్థుల ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్తో ఢీకొట్టి ధ్వంసం చేశారు. దాడిలో మున్నంగికి చెందిన వేమూరి బాలరాజు, వేమూరి అశోక్, కొండూరి మహేష్, వేమూరి మహేష్, మోజేషు తదితరులకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారితోపాటు బాధితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొన్నాళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని గ్రామస్థులు కోరుతున్నా, అధికార యంత్రాంగం నుంచి కనీస స్పందన కరవైంది. దీంతో గ్రామస్థులే జోక్యం చేసుకుని అడ్డుకోగా వారిపై ఇసుక మాఫియా దాడి చేయడం గమనార్హం. దాడికి పాల్పడిన వారిలో స్థానికులు వేమూరి మోసయ్య, ఆయన కుమారుడు చింతయ్య ఉన్నట్లు బాధితులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్