మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది.
ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీకి భారీ ఎదురుదెబ్బ
మృతుల్లో 9 మంది గుర్తింపు
మరణించినవారిలో 15 మంది మహిళలు
శంకర్రావు, లలితలపై రూ.8 లక్షల చొప్పున రివార్డు
ఈనాడు-హైదరాబాద్, కాంకేర్, చర్ల-న్యూస్టుడే: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మృతదేహాలను కాంకేర్కు తరలించిన ఛత్తీస్గఢ్ పోలీసులు.. బుధవారం రాత్రి నాటికి 9 మందిని గుర్తించారు. మృతుల్లో 15 మంది మహిళా మావోయిస్టులున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ మీడియాకు తెలిపారు. డివిజనల్ కమిటీ సభ్యులు శంకర్రావు, లలితలపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని చెప్పారు. ‘‘ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఛత్తీస్గఢ్లోని కాంకేర్, నారాయణపుర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతాల సరిహద్దులకు కూడలిగా ఉంది. ఈ డివిజన్ కమిటీలో 70-80 మంది మావోయిస్టులు ఉన్నారు. వేర్వేరు డివిజన్ కమిటీలు వేర్వేరు పనులు నిర్వహిస్తాయి. గుత్తేదారులు, ప్రజల నుంచి అక్రమంగా నగదు వసూలు చేయడం, ఇతర మావోయిస్టు కమిటీలకు వస్తువులు సరఫరా చేయడం ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ బాధ్యతలు. ఈ డివిజన్ కమిటీలో రావ్ఘాట్, ప్రతాప్పుర్, కువి, కిసోడో ఏరియా కమిటీలు ఉన్నాయి. మృతి చెందిన మావోయిస్టుల్లో ఎక్కువ మంది పార్థాపుర్ ఏరియా కమిటీకి చెందిన వారిగా గుర్తించాం’’ అని ఐజీ వివరించారు. ఉక్కపోత పరిస్థితులు, కొండ ప్రాంతాలు, తాగునీటి కొరత.. ఎన్కౌంటర్ సందర్భంగా భద్రతా బలగాలకు ఎదురైన సవాళ్లని ఛత్తీస్గఢ్లోని పఖాంజూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో లక్ష్మణ్ కేవట్ తెలిపారు.
అష్టదిగ్బంధం.. మావోయిస్టులకు ఊహించని పరిణామం
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం కాంకేర్ జిల్లా ఛోటేబేటియా పోలీసుస్టేషన్ పరిధిలోని బీనాగుండా-కోరుగట్ట అటవీప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో మావోయిస్టులు పెద్దఎత్తున సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో బీఎస్ఎఫ్, డీఆర్జీ బృందాలు అష్టదిగ్బంధం చేశాయి. ఈ బృందాల్లో సుమారు 200 మంది ఉన్నారు. ఆ సమయంలో మావోయిస్టులు భోజనాలు చేసి విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ దట్టమైన అటవీ ప్రాంతానికి నదులు, కొండలు దాటి.. బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు వస్తాయని మావోయిస్టులు ఊహించనట్లు తెలుస్తోంది. అనూహ్య పరిణామంతో వారు తేరుకోలేకపోయారని తెలుస్తోంది. కాంకేర్ ప్రాంతంపై ఎంతో పట్టుండి.. అనేక ఘటనలకు సూత్రధారిగా భావిస్తున్న డివిజనల్ కమిటీ సభ్యుడు శంకర్రావు మృతి చెందడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
మృతి చెందిన మావోయిస్టుల్లో పోలీసులు గుర్తించినవారు వీరే..
- శంకర్రావు - ఉత్తర బస్తర్ డివిజన్ మాస్ ఇన్ఛార్జి, డీవీసీ సభ్యుడు
- రంజిత (శంకర్రావు భార్య) - ఉత్తర బస్తర్ డివిజన్ సభ్యురాలు
- లలిత - డీవీసీ సభ్యురాలు, ప్రతాప్పుర్ ఏరియా కమిటీ, జనతన సర్కార్ కో-ఆర్డినేటర్ ఇన్ఛార్జి
- మాధవి - ఉత్తర బస్తర్ డివిజన్ సభ్యురాలు
- జుగ్ని అలియాస్ మాల్తి - ప్రతాప్పుర్ ఏరియా కమిటీ
- రూపి - ఫ్రాగ్ ఎల్వోఎస్ కమాండర్
- శ్రీకాంత్ - ప్రతాప్పుర్ ఏరియా కమిటీ
- రామ్శిల - ఉత్తర బస్తర్ డివిజన్ సభ్యురాలు
- సుఖ్లాల్ - ప్రతాప్పుర్ ఏరియా కమిటీ
భాజపా నేత దారుణ హత్య
దుమ్ముగూడెం, న్యూస్టుడే: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపుర్ జిల్లా దండ్వాన్ ఉపసర్పంచి, భాజపా నేత పంచమ్దాస్ మానిక్పురి(52)ను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఆయుధాలతో ఆయన ఇంట్లోకి చొరబడిన పలువురు మావోయిస్టులు.. పదునైన ఆయుధాలతో పంచమ్దాస్ను నరికిచంపారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, పోలీస్ ఇన్ఫార్మర్గా మారారంటూ పలు ఆరోపణలు చేస్తూ ఘటనా స్థలంలో కరపత్రాలు వదిలివెళ్లారు. కాంకేర్ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ