అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపుర్‌ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

Published : 29 Apr 2024 06:38 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం

లఖీంపుర్‌ ఖేరీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపుర్‌ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం అమన్‌(22) అనే యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాధితురాలి వెంట పడ్డాడు. ఈ ప్రతిపాదనను బాలిక తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన అతడు ఈ నెల 19న ఆమెను బంధించి మూడురోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా  కాల్చిన ఇనుప రాడ్డుతో బాధితురాలి ముఖంపై తన పేరును రాసి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. 21న ఎలాగోలా నిందితుడి చెర నుంచి బాలిక తప్పించుకోవడంతో విషయం బయటపడింది. బాధితురాలి కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసును నమోదు చేసిన పోలీసులు ఆదివారం అతడిని జైలుకు తరలించారు. కాగా నిందితుడు హైదరాబాద్‌లోని ఓ సెలూన్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని