హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్ని పట్టుకున్న పోలీసులు
మద్యం సీసాలు, రసాయనాల స్వాధీనం
విశాఖపట్నం (ఎంవీపీకాలనీ, జగదాంబకూడలి), న్యూస్టుడే: విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్ని విశాఖ పోలీసు కమిషనర్ రవిశంకర్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... పాత నేరస్థుడైన సుశాంత్ పాత్రో కొన్ని రోజులుగా పోలీసులకు కనిపించక పోవడంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. అతను శిరీష అనే మహిళతో కలిసి విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఓ రకం హోమియోపతి మందులో 90 శాతం ఆల్కహాలు ఉంటుంది. సుశాంత్ దీనికి రంగుల్ని జోడించి, కల్తీ మద్యం తయారు చేస్తున్నాడు. కొన్ని బ్రాండ్ల సీసాల్ని సేకరించి వాటిలో నకిలీ మద్యం పోసి... బెల్టు షాపులు, కిరాణా దుకాణాల్లో తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ముడిసరకును ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. నిందితుల నుంచి హోమియోపతి మందులు, రంగులు, 5,625 లీటర్ల నకిలీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల వేళ కలకలం..
సార్వత్రిక ఎన్నికల సమయంలో నకిలీ మద్యం వ్యవహారం కలకలం సృష్టించింది. ఈ నకిలీ మద్యాన్ని తాగితే ప్రమాదమని సాక్షాత్తూ పోలీసులే చెబుతున్నారు. అయితే ఇప్పటికే అనకాపల్లి జిల్లా పరవాడ, సబ్బవరం పరిసర ప్రాంతాల్లో ఈ నకిలీ మద్యం విక్రయం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో బెల్టుషాపుల ద్వారా ఈ మద్యాన్ని ఇప్పటికే ఎక్కువ మందికి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దర్ని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ, మార్కెటింగ్, సరఫరా లాంటి అంశాలపై ఆరాతీస్తే ఎక్కువ మంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మద్యం తాగిన వారు ఎంతమంది ఉంటారో గుర్తించి వారికి ఆరోగ్య పరంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన కేసుల్లో కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డి.లక్ష్మణ్సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. -
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
తెలంగాణలో ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు. -
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
హైదరాబాద్లో ఓ యువతికి అనుమానాస్పద స్థితిలో గాయాలు కావడం కలకలం రేపింది. -
శ్రీశైలం వెళ్తుండగా వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో ప్రమాదం జరిగింది. శ్రీశైలం వెళ్తున్న భక్తుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. -
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
పెంపుడు కుక్క విషయంలో గొడవ.. కుటుంబంపై దాడి
మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రహమత్నగర్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. -
బాలికలతో బలవంతపు వ్యభిచారం.. అరెస్టయిన వారిలో డీఎస్పీ
Prostitution racket: అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు సెక్స్ రాకెట్ను ఛేదించారు. మైనర్ బాలికలను రక్షించారు. ఐదుగురు ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్లకు మ్యూల్ ఖాతాలు.. బెంగళూరులో చిక్కిన ఖమ్మం వాసి
నిర్మల్ జిల్లా భైంసా వాసులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి.. వాటిని ఆన్లైన్ బెట్టింగ్లకు వినియోగించిన కేసులో కీలక నిందితుడు చిక్కాడు. -
అర్ధరాత్రి ఆరుగురు సజీవ దహనం
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఆరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి
గుజరాత్లోని నర్మదా నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరందరూ స్నానానికి వెళ్లగా ఈ దుర్ఘటన జరిగింది. -
సచిన్ ఇంటి సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఇంటి వద్ద భద్రతా విధులు నిర్వర్తించే గార్డు కాప్డే (39) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఓ అధికారి వెల్లడించారు. -
చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధ దంపతుల మృతి
వేగంగా వెళ్తూ అదుపు తప్పిన కారు.. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్న ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
కామారెడ్డి డీఎంహెచ్వో లైంగిక వేధింపులు.. ఏడు కేసుల నమోదు
కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డి.లక్ష్మణ్సింగ్పై వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్రావు బుధవారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
-
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ గెలుపు
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?