Road Accident: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అబ్బరాజు పృథ్వీరాజ్‌(30) దుర్మరణం పాలయ్యారు.

Updated : 17 May 2024 07:49 IST

జహీరాబాద్‌ అర్బన్‌, చైతన్యపురి-న్యూస్‌టుడే: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అబ్బరాజు పృథ్వీరాజ్‌(30) దుర్మరణం పాలయ్యారు. విద్యుత్తు శాఖ విశ్రాంత ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలోని అలకాపురిలో స్థిరపడింది. ఆయన రెండేళ్ల కిందటే మృతి చెందారు. వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా యూఎస్‌లోని నార్త్‌ కరోలినాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నిరుడు శ్రీప్రియను వివాహం చేసుకున్నారు. భార్యతో కలిసి బుధవారం కారులో వెళ్తూ... వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు. అది పల్టీలు కొట్టింది. తమ కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. భార్యను కారులోనే కూర్చోబెట్టి... బయటికి వచ్చిన పృథ్వీరాజ్‌ ప్రమాద ఘటనపై పోలీసులకు ఫోన్‌ చేస్తుండగా.. వేగంగా వచ్చిన మరో కారు ఆయన్ని ఢీకొట్టింది. దాంతో ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్‌ తీసుకురానున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని