మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు.
ఆపై బ్యాంకుకు పంపి రూ.60 లక్షలు బదిలీ చేయించుకున్న సైబర్ మోసగాడు
ఫిర్యాదుతో సత్వరం స్పందించి సొమ్మును నిలిపివేయించిన సీఎస్బీ
ఈనాడు, హైదరాబాద్: ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు. తరువాత వీడియోకాల్లో మాట్లాడుతూనే ఆమెను బ్యాంకుకు పంపి రూ.60 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. కానీ బాధితురాలు వెంటనే తేరుకొని ఫిర్యాదు చేయడంతో స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్సీఎస్బీ) పోలీసులు డబ్బులు డ్రా కాకుండా నిలువరించారు. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివసించే మహిళకు ఈ నెల 15న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకొని.. మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని, అరెస్టు వారెంట్ జారీ అయిందని ఆమెను బెదిరించాడు. భయాందోళనకు గురైన బాధితురాలు తనను కాపాడమని కోరారు. ఇదే ఆసరాగా స్కైప్లో వీడియోకాల్ చేసిన ఆగంతకుడు పలు విధాలుగా ఆమెను భయపెట్టాడు. వాష్రూంకు కూడా వెళ్లనీయకుండా మరుసటి రోజు ఉదయం బ్యాంకు తెరిచే సమయం వరకు వీడియోకాల్ ఆన్లోనే ఉంచేలా చేశాడు. ఆపై కేసును కొట్టేసేలా చేస్తానంటూ ఆమెను బ్యాంకుకు పంపించి పలు ఖాతాలకు రూ.60 లక్షలు బదిలీ చేయించుకున్నాడు.
ఈ తతంగం ముగిసే వరకు కూడా వీడియోకాల్ కొనసాగిస్తూనే ఉండేలా ఒత్తిడి చేయడం గమనార్హం. కొంతసేపటికే తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చారు. అప్రమత్తమైన సీఎస్బీ బృందం ఆన్లైన్ లావాదేవీల వివరాల్ని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్)లో నమోదు చేయించారు. అలాగే ఎస్బీఐ ఖాతాలకు నగదు బదిలీ కావడంతో ఆ బ్యాంకు ప్రతినిధులనూ అప్రమత్తం చేశారు. ఈ ప్రక్రియనంతా గంటలోపే ముగించడంతో ఆయా ఖాతాల నుంచి నగదును ఎవరూ ఉపసంహరించకుండా నిలిపివేయించారు. దీంతో బాధితురాలు ఊపిరి పీల్చుకున్నారు. సైబర్ నేరస్థులు సొమ్ము కొట్టేసినా.. సత్వరం ఫిర్యాదు చేస్తే వెనక్కి తీసుకురావొచ్చని సీఎస్బీ మరోసారి నిరూపించింది. ఇటీవలే రూ.కోటి కొట్టేస్తే 25 నిమిషాల్లోనే స్పందించి నిందితులకు చేరకుండా ఆపివేయించిన ఘటన తెలిసిందే. ఈ సందర్భంగా సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయెల్.. ఎస్సై శిరీష, కానిస్టేబుళ్లు రెహమాన్, కృష్ణలను అభినందించారు. పోలీసులు లేదా ప్రభుత్వ సంస్థల ప్రతినిధులెవరూ వీడియోకాల్ లేదా స్కైప్ కాల్ చేసి డబ్బులు అడగరని, అలా ఎవరైనా ఫోన్ చేస్తే.. 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు