మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు వల
వారితో సైబర్ నేరాలు చేయించిన చైనా కంపెనీలు
ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు
సైబర్ మోసాల వివరాలను వివరిస్తున్న సీపీ రవిశంకర్
విశాఖపట్నం (ఎంవీపీ కాలనీ), న్యూస్టుడే: విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ అక్రమ రవాణాను విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్తామని విశాఖ పోలీసు కమిషనర్ రవిశంకర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన విలేకర్లకు ఈ వివరాలు వెల్లడించారు.
‘‘విశాఖ గాజువాకకు చెందిన కన్సల్టెంట్ చుక్క రాజేష్ (33) ఇంజినీరింగ్ చదివి కొంతకాలం గల్ఫ్లో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజర్గా పనిచేశాడు. ఆ అనుభవంతో ఫైర్ సేఫ్టీ చదివినవారిని విదేశాలకు పంపేవాడు. ఆ విషయం తెలిసిన సంతోష్ 2023 మార్చిలో రాజేష్ను కలిశాడు. కాంబోడియాలో ఉద్యోగాలున్నాయని.. ఒక్కో వ్యక్తి నుంచి రూ.90వేలు తీసుకుని తాను చెప్పిన వ్యక్తికి రూ.70వేలు ఇచ్చి మిగతా రూ.20వేలు నువ్వు తీసుకోవాలని రాజేష్కు సంతోష్ సలహా ఇచ్చాడు. అలా వెళ్లేవారితో సైబర్ నేరాలు చేయిస్తామని.. ఆ విషయం వారికి చెప్పకూడదని కోరాడు. ఇద్దరి మధ్య అవగాహనతో రాజేష్ 27 మందిని కాంబోడియా పంపించాడు. తర్వాత రాజేష్కు ఆర్య, హబీబ్ అనే మరో ఇద్దరు ఏజెంట్లు పరిచయమయ్యారు. వారు ఇంకా ఎక్కువ కమీషన్ ఇస్తామనడంతో ఒక్కొక్కరి వద్ద రూ.1.50 లక్షలు తీసుకుని 150 మందిని రాజేష్ కాంబోడియా పంపించాడు. ఇలా వెళ్లినవారిని అక్కడి ఏజెంట్లు కాంబోడియా కంపెనీలకు 2500 నుంచి 4 వేల అమెరికన్ డాలర్లకు విక్రయించేవారు.
తర్వాత వీరిని చైనా కంపెనీ ప్రతినిధులు అదుపులోకి తీసుకుని బలవంతంగా సైబర్ మోసాలు చేయించేవారు. సంపాదించిన డబ్బులో 1% వీరికి ఇచ్చి, కంపెనీలు 99% తీసుకునేవి. వీరిని వ్యసనాలకు బానిసలు చేసేవారు. వీరినుంచి తప్పించుకుని విశాఖకు చెందిన ఓ బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సైబర్ సీఐ భవానీప్రసాద్ విచారణ జరిపి ముఖ్య ఏజెంటు రాజేష్, కొండలరావు, జ్ఞానేశ్వరరావు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. గత రెండేళ్లుగా విశాఖ, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, తుని, కోల్కతాల నుంచి కాంబోడియాకు సుమారు 5వేల మందిని పంపారు. గత రెండేళ్లలో రూ.100 కోట్ల మేర సైబర్ నేరాలకు వీరు పాల్పడ్డారు. ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని కాంబోడియాలోని భారతీయ ఎంబసీ దృష్టికి తీసుకెళ్తాం’’ అని సీపీ రవిశంకర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్బీ ఏడీసీపీ వెంకటరావు, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ రాజీవ్కుమార్, సీఐ భవానీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు