అలుముకున్న నిర్లక్ష్యం.. అగ్నికీలలై
పైపులైన్ల ద్వారా గృహాలకు వంట గ్యాస్ సరఫరా చేస్తున్న మేఘా సంస్థ నిర్లక్ష్యం కారణంగా.. జీవనోపాధి కోసం తెలంగాణ నుంచి వచ్చిన ఓ కుటుంబం పెను ప్రమాదానికి గురైంది.
కనెక్షన్లు ఇవ్వకుండానే పైపులైన్కు గ్యాస్ సరఫరా
కృష్ణా జిల్లాలోని ఓ పరిశ్రమ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం
మంటల్లో చిక్కుకొని నలుగురికి తీవ్రంగా కాలిన గాయాలు
మోహన్ స్పింటెక్స్ పరిశ్రమ ఆవరణలోని పేలుడు సంభవించిన ఇల్లు
హనుమాన్ జంక్షన్, న్యూస్టుడే: పైపులైన్ల ద్వారా గృహాలకు వంట గ్యాస్ సరఫరా చేస్తున్న మేఘా సంస్థ నిర్లక్ష్యం కారణంగా.. జీవనోపాధి కోసం తెలంగాణ నుంచి వచ్చిన ఓ కుటుంబం పెను ప్రమాదానికి గురైంది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లెలోని మోహన్ స్పింటెక్స్ పరిశ్రమలో కార్మికుల వసతిగృహ సముదాయానికి గ్యాస్ సరఫరా సంస్థ నిర్వాహకులు పైపులైను అమర్చారు. వాటికి డమ్మీలు అమర్చకుండానే గ్యాస్ సరఫరా చేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వీరవల్లి ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఆదిలాబాద్కు చెందిన సాయినాథ్ (27), లక్ష్మీబాయి (20) దంపతులు రేమల్లెలోని మోహన్ స్పింటెక్స్లో కార్మికులుగా పని చేసేందుకు వచ్చారు. ఏడాది కిందటే వీరికి వివాహమైంది. మహారాష్ట్రలో ఉంటున్న సాయినాథ్ సోదరి అనిత పాండురంగ పండరి (34) తన అయిదేళ్ల కుమారుడు యువరాజ్తో కలిసి కొంతకాలం కిందట ఇక్కడకు వచ్చారు. ఆమె కూడా ఇదే పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరంతా పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న నివాస సముదాయం (క్వార్టర్స్)లో ఉంటున్నారు. శనివారం అర్ధరాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చారు. పాలు కాచేందుకు పొయ్యి వెలిగించగానే.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న నలుగురూ అగ్నికీలల్లో చిక్కుకున్నారు. చుట్టపక్కల కార్మికులు గమనించి వారిని బయటకు చేర్చేలోపు నలుగురికీ సగానికి పైగా కాలిన గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న సామగ్రి దగ్ధమైంది. క్షతగాత్రులను మొదట నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం వారు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. దాదాపు 240 కుటుంబాలు నివసిస్తున్న క్వార్టర్స్కు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం తగదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లల్లోకి గ్యాస్ సరఫరా చేసే పాయింట్ల వద్ద డమ్మీలు అమర్చకపోవడంతోనే వాయువు వెలువడి, ప్రమాదానికి కారణమైందని ఎస్సై చిరంజీవి తెలిపారు. మోహన్ స్పింటెక్స్ పరిశ్రమ వర్గాల ఫిర్యాదు మేరకు మేఘా కంపెనీ ప్రతినిధులపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డమ్మీ అమర్చని గ్యాస్ పైపులైను వద్ద జరిగిన పేలుడు ఆనవాళ్లు
ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సాయినాథ్, లక్ష్మి దంపతులు
ఆసుపత్రిలో తీవ్రంగా కాలిన గాయాలతో తల్లి అనిత, కుమారుడు యువరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM