రూ.1,770 కోట్లు కొల్లగొట్టారు
దేశంలో సైబర్ నేరాలకు సంబంధించి రోజుకు సగటున 6 వేలకు పైగా ఫిర్యాదులందుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 7.4 లక్షల కేసులు నమోదయ్యాయి.
4 నెలల్లో సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్ము
సైబర్ నేరాలపై ఐ4సీ గణాంకాల్లో విస్తుపోయే నిజాలు
ఈనాడు, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరాలకు సంబంధించి రోజుకు సగటున 6 వేలకు పైగా ఫిర్యాదులందుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 7.4 లక్షల కేసులు నమోదయ్యాయి. వీటిలో నకిలీ ట్రేడింగ్, డిజిటల్ మోసాలు వంటి ప్రధాన కేసుల్లోనే బాధితులు పోగొట్టుకున్న మొత్తం దాదాపు రూ.1,770 కోట్లు. దేశంలో సైబర్ నేరాల తీవ్రతకు అద్దం పడుతున్న గణాంకాలివి. సామాన్యుడి నుంచి ఉన్నతాధికారుల దాకా వీటిబారిన పడుతున్నారు. గ్రామాల నుంచి మెట్రో నగరాల వరకు సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ‘ఆన్లైన్ ట్రేడింగ్’ పేరిట హైదరాబాద్లోని ఓ విశ్రాంత ఐఏఎస్ రూ.1.87 కోట్లు కోల్పోతే.. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఓ వ్యాపారి రూ.7 కోట్లు మోసపోవడం తాజా ఉదంతాలు. దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విరుగుడు చర్యలపై ఇండియన్ సైబర్క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) దృష్టి సారించింది. ఈ మేరకు గణాంకాలను వెల్లడిస్తూ.. ఎక్కువగా ఏ తరహా మోసాలు జరుగుతున్నాయో గుర్తించింది.
నకిలీ ట్రేడింగ్: షేర్లలో పెట్టుబడుల ద్వారా లాభాలు గడించేందుకు మెలకువలు నేర్పిస్తామంటూ సైబర్ నేరగాళ్లు వాట్సప్ గ్రూపుల్లో చేర్పిస్తున్నారు. తొలుత కొంతమేర లాభాలు ఇప్పించి ఆకర్షిస్తున్నారు. వర్చువల్ ఖాతాల్లో పెద్దమొత్తంలో సొమ్ము జమ అవుతున్నట్లు చూపిస్తున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టాక వర్చువల్ ఖాతాల్లో కనిపిస్తున్న లాభాల్ని విత్డ్రా చేసుకుందామంటే స్పందించడం మానేస్తున్నారు. ఒత్తిడి చేస్తే గ్రూప్లో నుంచి తొలగిస్తున్నారు.
లోన్ యాప్లు: ఆన్లైన్లోనే సులభంగా రుణాలిస్తామంటూ నేరగాళ్లు ఆశ పెడుతున్నారు. ఈ క్రమంలో బాధితుల సెల్ఫోన్లో కాంటాక్టు నంబర్లు, ఫొటోలు, వీడియోలు వీక్షించేలా అనుమతులు పొందుతున్నారు. రుణం మంజూరు చేసిన తర్వాత భారీమొత్తంలో వడ్డీలు విధిస్తున్నారు. కట్టకపోతే బాధితుల ఫోన్లలోని ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతుండటంతోపాటు కాంటాక్టు నంబర్లకు ఫోన్లు చేసి దొంగగా చిత్రీకరిస్తూ అవమానాల పాల్జేస్తున్నారు. వీరి వేధింపులకు దేశవ్యాప్తంగా 100 మంది వరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులందాయి.
డేటింగ్ యాప్లు: డేటింగ్ యాప్లలో అందమైన యువతుల ఫొటోలు, ఫోన్ నంబర్లను ఉంచుతున్నారు. ఎవరైనా కాల్చేస్తే తీయని మాటలతో ఆకర్షిస్తున్నారు. డేటింగ్ పేరిట కొద్దిరోజులు మాట్లాడి భావోద్వేగాలతో కూడిన ప్రేమ నటిస్తున్నారు. అనంతరం అత్యవసర చికిత్సల పేరిట డబ్బు లాగుతున్నారు. ఇటీవలి కాలంలో పబ్లకు, క్లబ్లకు తీసుకెళ్లి రూ.వేలల్లో బిల్లులు కట్టిస్తున్న ఉదంతాలు నగరాల్లో పెరుగుతున్నాయి.
గేమింగ్ యాప్లు: సైబర్ నేరగాళ్ల ముఠాలు సెల్ఫోన్లలో గేమ్లకు అనుమతులిచ్చే ముసుగులో బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఖాతాల్లోనుంచి డబ్బు కొట్టేస్తున్నారు. ఆన్లైన్ గేమ్లలో పెట్టుబడులు పెట్టించి డబ్బులను కాజేస్తున్నారు.
నకిలీ ఖాతాలతో..: ప్రముఖుల పేర్లతో కూడిన నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలను రూపొందించి డబ్బులు కొట్టేసే మోసమిది. ప్రముఖుల ఫొటోలను ఆన్లైన్లో సేకరించి వాటితోనే సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను తెరుస్తున్నారు. ఆయా ప్రముఖుల పరిచయస్థులకు మెసేజ్లు పంపించి అత్యవసరంగా డబ్బు అవసరముందని నమ్మించి లూటీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి