డిజిటల్‌ అరెస్టు బాధితుడు గుండెపోటుతో మృతి

Eenadu icon
By Crime News Desk Published : 31 Oct 2025 05:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పుణె: డిజిటల్‌ అరెస్టు మోసంలో సైబర్‌ నేరగాళ్ల చేతిలో రూ.1.2 కోట్లు పొగొట్టుకున్న పుణేకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. ప్రభుత్వ విశ్రాంత అధికారి అయిన బాధితుడికి నెల క్రితం సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి మనీ లాండరింగ్‌ కేసులో తన పేరు ఉందంటూ బెదిరించారు. డిజిటల్‌ అరెస్టు పేరిట బాధితుడిని, ఆయన భార్యను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. పలు దఫాలుగా మొత్తం రూ.1.2 కోట్లు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. అయితే, గతవారం బాధితుడు గుండెపోటుతో మరణించారు. ఆ వ్యక్తి మృతిచెందిన వారం తర్వాత అతడి భార్య పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని