పంటలు దెబ్బతిన్నాయని.. రైతు బలవన్మరణం

Eenadu icon
By Crime News Desk Published : 31 Oct 2025 05:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

లింగాపూర్, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంట నష్టాలను చవిచూసిన ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గంగన్న తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంనాయక్‌ తండాకు చెందిన జాదవ్‌ బలిరాం(59) తనకున్న ఏడు ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. బుధవారం తన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లిన ఆయన పంట నష్టపోయిన పరిస్థితులను చూసి మనస్తాపానికి గురయ్యారు. మధ్యాహ్నం అక్కడే పురుగుమందు తాగారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం సిర్పూర్‌(యు) ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు