ఎనిమిదో తరగతి బాలికపై లైంగిక దాడి

Eenadu icon
By Crime News Desk Updated : 02 Nov 2025 05:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నిందితుల్లో ఇద్దరు మైనర్లు.. ఖమ్మం జిల్లాలో ఘటన 

కొణిజర్ల, న్యూస్‌టుడే: ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై డిగ్రీ విద్యార్థితోపాటు ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ కాలనీలో 8వ తరగతి చదువుతున్న బాలిక(13) తల్లిదండ్రులు పనిమీద హైదరాబాద్‌ వెళ్లారు. నాయనమ్మ, తాతయ్య స్థానికంగా ప్రార్థన చేసేందుకు వెళ్లారు. బాలిక ఇంటి సమీపంలో ఇంటర్‌ చదువుతున్న బాలుడున్నాడు. ‘మీ తమ్ముడు కిందపడిపోయాడ’ని నమ్మబలికి ఆమెను నిందితుడైన మరో బాలుడి ఇంటికి తీసుకెళ్లాడు. తలుపులు వేసి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న అరవింద్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఇద్దరు బాలురు కూడా బాలికపై అఘాయిత్యం చేశారు. మైనర్లిద్దరూ ఇంటర్‌ చదువుతున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఎస్సై సూరజ్‌ నిందితులపై పోక్సో, సామూహిక అత్యాచారం కేసులు నమోదు చేశారు. అరవింద్‌ను అదుపులోకి తీసుకోగా బాలురు పరారీలో ఉన్నారు.

Tags :
Published : 02 Nov 2025 05:26 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు