ఎనిమిదో తరగతి బాలికపై లైంగిక దాడి
నిందితుల్లో ఇద్దరు మైనర్లు.. ఖమ్మం జిల్లాలో ఘటన
కొణిజర్ల, న్యూస్టుడే: ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై డిగ్రీ విద్యార్థితోపాటు ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ కాలనీలో 8వ తరగతి చదువుతున్న బాలిక(13) తల్లిదండ్రులు పనిమీద హైదరాబాద్ వెళ్లారు. నాయనమ్మ, తాతయ్య స్థానికంగా ప్రార్థన చేసేందుకు వెళ్లారు. బాలిక ఇంటి సమీపంలో ఇంటర్ చదువుతున్న బాలుడున్నాడు. ‘మీ తమ్ముడు కిందపడిపోయాడ’ని నమ్మబలికి ఆమెను నిందితుడైన మరో బాలుడి ఇంటికి తీసుకెళ్లాడు. తలుపులు వేసి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న అరవింద్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఇద్దరు బాలురు కూడా బాలికపై అఘాయిత్యం చేశారు. మైనర్లిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఎస్సై సూరజ్ నిందితులపై పోక్సో, సామూహిక అత్యాచారం కేసులు నమోదు చేశారు. అరవింద్ను అదుపులోకి తీసుకోగా బాలురు పరారీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

రహదారులపై రక్తధారలు
సాఫీగా సాగాల్సిన ప్రయాణాల్లో అనూహ్య ప్రమాదాలు... నెత్తుటి ధారలతో తడిచిన రహదారులు... ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యుల రోదనలు... వెరసి రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకున్న మూడు వేర్వేరు ప్రమాదాలు ఏడుగురిని పొట్టన పెట్టుకోగా 23 మంది గాయపడ్డారు. - 
                                    
                                        

నకిలీ మద్యం కేసులో మరో నలుగురు నిందితులు
నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది. - 
                                    
                                        

ప్రియుడిపై దాడిచేసి.. యువతిపై సామూహిక అత్యాచారం
ప్రేమజంట కారులో కూర్చొని మాట్లాడుకుంటుండగా అక్కడకు వచ్చిన దుండగులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. - 
                                    
                                        

కొత్త ఫోన్ కోసం వచ్చి...
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్లో నివాసముంటున్న గుర్రాల శ్రీనివాస్రెడ్డి కుమార్తె అఖిలారెడ్డి గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. - 
                                    
                                        

గుంతలో పడి చిన్నారి మృతి
అభం... శుభం... తెలియని ఓ చిన్నారి అనుకోని పరిస్థితిలో అసువులు బాశాడు. విద్యాబుద్ధులు నేర్చుకుందామని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారిని ప్రమాదకర నీటిగుంత పొట్టన పెట్టుకుంది. - 
                                    
                                        

నాడు పెనుకొండలోనూ ఇదే తరహా ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన ప్రమాదం... పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుకొండ స్టేషన్ సమీపంలో జరిగిన దుర్ఘటన ఒకే తరహాలో ఉన్నాయి. - 
                                    
                                        

అక్షర దీపికలు... ఇక కానరారు!
తండ్రి కారు డ్రైవర్. తల్లి గృహిణి. వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు తాండూరులో నివాసముంటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియ, నందిని, తనూషలు చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివారు. - 
                                    
                                        

రాజస్థాన్లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం
నియంత్రణ కోల్పోయిన ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ 14 మంది మృతికి కారణమయ్యాడు. దాదాపు 300 మీటర్ల మేర 17కి పైగా వాహనాలను ఢీకొంటూ వెళ్లి మరో 13 మందిని గాయపరిచాడు. - 
                                    
                                        

ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులు.. తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ బలవన్మరణం
సంగారెడ్డి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్కుమార్(23) పట్టణ శివారులోని మహబూబ్సాగర్ కట్టపై తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

ఎయిర్పోర్ట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్.. పారిపోతుండగా నిందితులపై కాల్పులు
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 


