GHMC: పారిశుద్ధ్య ఉద్యోగి కీచకపర్వం
జీహెచ్ఎంసీ గాజులరామారం సర్కిల్ పరిధిలో ఓ శానిటేషన్ ఫీల్ట్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళా కార్మికులను లొంగదీసుకుని అసభ్యకర ప్రవర్తన
వారితో సెల్ఫోన్లో వీడియోల చిత్రీకరణ
ఎస్ఎఫ్ఏను డిస్మిస్ చేసిన ఉన్నతాధికారులు
కిషన్
షాపూర్నగర్, న్యూస్టుడే: జీహెచ్ఎంసీ గాజులరామారం సర్కిల్ పరిధిలో ఓ శానిటేషన్ ఫీల్ట్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రబుద్ధుడు మహిళా పారిశుద్ధ్య కార్మికులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ బాగోతాన్ని తన సెల్ఫోన్లోనే చిత్రీకరించాడు. తర్వాత వాటిని చూపించి.. వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నాడు. కార్మికులు తెలిపిన సమాచారం ప్రకారం.. మూణ్నెల్ల కిందట ఈ ఎస్ఎఫ్ఏ కిషన్ బాగోతంపై అధికారులకు తెలియడంతో.. అతన్ని సూరారం ప్రాంతానికి బదిలీ చేశారు. మహిళా కార్మికులు తనతో సఖ్యతగా ఉంటూ.. పనులు చేయకున్నా హాజరువేయడం, తనకు తలొగ్గకపోతే పనులకు వచ్చినా గైర్హాజరు చూపుతూ బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబితే తన పలుకుబడితో ఉద్యోగాల నుంచి తీసేయిస్తానని భయపెడుతూ కీచకపర్వాన్ని కొనసాగిస్తున్నాడు.
కార్మికుడికి ఫోన్ ఇవ్వడంతో వెలుగులోకి..
ఎస్ఎఫ్ఏ కిషన్ మూడు నెలల కిందట బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్తూ అధికారిక సెల్ఫోన్ను ఓ కార్మికుడికి అప్పగించి వెళ్లాడు. దీంతో ఈ వీడియోలు బయటపడ్డాయి. మహిళా కార్మికులతో ఈ కామాంధుడి లీలలకు సంబంధించిన 69 వీడియోలు అందులో ఉన్నాయి. సదరు కార్మికుడు వాటిని ఇతర సిబ్బందికి, ఉన్నతాధికారులకు పంపాడు. ఈక్రమంలో కిషన్ మరోసారి ఇలాంటి తప్పులు చేయనని అధికారులను బతిమాలుకోగా వారు వదిలేశారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో వారం కిందట ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తీవ్రంగా పరిగణించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్, గాజులరామారం ఉపకమిషనర్ మల్లారెడ్డి, వైద్యాధికారి భాస్కర్రెడ్డిలను ఆదేశించారు. వారు విచారించి ఇచ్చిన నివేదికతో.. కిషన్తో పాటు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు సీహెచ్ ప్రణయ్ను గురువారం సర్వీసు నుంచి డిస్మిస్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్