GHMC: పారిశుద్ధ్య ఉద్యోగి కీచకపర్వం
జీహెచ్ఎంసీ గాజులరామారం సర్కిల్ పరిధిలో ఓ శానిటేషన్ ఫీల్ట్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళా కార్మికులను లొంగదీసుకుని అసభ్యకర ప్రవర్తన
వారితో సెల్ఫోన్లో వీడియోల చిత్రీకరణ
ఎస్ఎఫ్ఏను డిస్మిస్ చేసిన ఉన్నతాధికారులు
కిషన్
షాపూర్నగర్, న్యూస్టుడే: జీహెచ్ఎంసీ గాజులరామారం సర్కిల్ పరిధిలో ఓ శానిటేషన్ ఫీల్ట్ అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రబుద్ధుడు మహిళా పారిశుద్ధ్య కార్మికులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ బాగోతాన్ని తన సెల్ఫోన్లోనే చిత్రీకరించాడు. తర్వాత వాటిని చూపించి.. వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నాడు. కార్మికులు తెలిపిన సమాచారం ప్రకారం.. మూణ్నెల్ల కిందట ఈ ఎస్ఎఫ్ఏ కిషన్ బాగోతంపై అధికారులకు తెలియడంతో.. అతన్ని సూరారం ప్రాంతానికి బదిలీ చేశారు. మహిళా కార్మికులు తనతో సఖ్యతగా ఉంటూ.. పనులు చేయకున్నా హాజరువేయడం, తనకు తలొగ్గకపోతే పనులకు వచ్చినా గైర్హాజరు చూపుతూ బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబితే తన పలుకుబడితో ఉద్యోగాల నుంచి తీసేయిస్తానని భయపెడుతూ కీచకపర్వాన్ని కొనసాగిస్తున్నాడు.
కార్మికుడికి ఫోన్ ఇవ్వడంతో వెలుగులోకి..
ఎస్ఎఫ్ఏ కిషన్ మూడు నెలల కిందట బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్తూ అధికారిక సెల్ఫోన్ను ఓ కార్మికుడికి అప్పగించి వెళ్లాడు. దీంతో ఈ వీడియోలు బయటపడ్డాయి. మహిళా కార్మికులతో ఈ కామాంధుడి లీలలకు సంబంధించిన 69 వీడియోలు అందులో ఉన్నాయి. సదరు కార్మికుడు వాటిని ఇతర సిబ్బందికి, ఉన్నతాధికారులకు పంపాడు. ఈక్రమంలో కిషన్ మరోసారి ఇలాంటి తప్పులు చేయనని అధికారులను బతిమాలుకోగా వారు వదిలేశారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో వారం కిందట ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తీవ్రంగా పరిగణించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్, గాజులరామారం ఉపకమిషనర్ మల్లారెడ్డి, వైద్యాధికారి భాస్కర్రెడ్డిలను ఆదేశించారు. వారు విచారించి ఇచ్చిన నివేదికతో.. కిషన్తో పాటు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు సీహెచ్ ప్రణయ్ను గురువారం సర్వీసు నుంచి డిస్మిస్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రీల్స్ మోజులో ఇద్దరు బాలురి దుర్మరణం
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి బయటకు వచ్చిన ముగ్గురు బాలురు స్కూటీపై ప్రయాణిస్తూనే సెల్ఫోన్లో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. -
ఉపాధి లేక... పూట గడవక..!
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పైగా ఆరు నెలలుగా పనిలేదు. పూట గడవని దుస్థితితో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక కుంగిపోయిన ఓ చేనేత కార్మికుడు రైలు కిందపడి ప్రాణం తీసుకున్నారు. -
మావోయిస్టుల భారీ కుట్ర భగ్నం
ఇన్ఫార్మర్లు, పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు అమర్చేందుకు యత్నించిన మావోయిస్టుల భారీ కుట్రను ములుగు జిల్లా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
వితంతురాలైన వదినను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అతడి మిగతా సోదరులు కాల్చి చంపిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బాగ్పత్ గ్రామంలో వెలుగు చూసింది. -
విమానాల్లో టక్కరి దొంగ
విమానాల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా కేటుగాడు ఆర్జీఐఏ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల్లో వెళ్తూ ఆరు చోరీలు చేసిన అతడి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. దీంతో ఆదివాసీ పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. -
గోవుల రవాణా నేపథ్యంలో ఘర్షణ
గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానగా మారి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మెదక్ పట్టణంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. -
బవారియా గ్యాంగ్ పంజా
నగరంపై ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా గ్యాంగ్ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. -
కన్నకొడుకే కాలయముడు
ఆ తల్లిదండ్రుల పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు.. కనిపెంచిన వారిని కిరాతకంగా డబ్బు కోసం అంతమొందించాడు.. -
గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త
ఓ యువతిని పెళ్లాడిన వ్యక్తి ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. న్యాయపోరాటం చేయడంతో ప్రతినెలా మనోవర్తి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.