Hyderabad: కాలేజీ వ్యాన్ ఢీకొని జీహెచ్ఎంసీ కార్మికురాలు మృతి
కింగ్కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు సునీత(35) మృతి చెందింది.
హైదరాబాద్: కింగ్కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు సునీత(35) మృతి చెందింది. అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలకు చెందిన బస్సు అతివేగంగా వచ్చి రహదారి పక్కనే ఉన్న చెట్టు దగ్గర శుభ్రం చేస్తున్న కార్మికురాలిని బలంగా ఢీకొట్టింది. వెంటనే స్థానికంగా ఉన్న జీహెచ్ఎంసీ కార్మికులు స్పందించి.. ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
సార్.. నన్ను గుర్తుపట్టారా..? నా ప్రాణాలు కాపాడింది మీరే
అయితే అప్పటికే సునీత మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి శవాగారానికి తరలించారు. బస్సును సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. -
ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూఝ్మడ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
టమాటా పెట్టెల చాటున తెలంగాణ మద్యం రవాణా
తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పోలీసులు అరెస్టు చేశారు. -
మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి పేరుతో నకిలీ ఖాతాలు
తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!