Gurugram: ‘నేనేం తప్పు చేశాను.. నాకెందుకు ఈ శిక్ష’... 14 ఏళ్ల బాలికపై దంపతుల పైశాచిక దాడి!
పని సరిగా చేయడంలేదని 14 ఏళ్ల బాలికను గుర్గ్రామ్కు చెందిన దంపతులు తీవ్రంగా హిసించారు. బాలిక పరిస్థితి గురించి తెలుసుకున్న సామాజిక కార్యకర్త పోలీసుల సహాయంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.
గురుగ్రామ్: పేదరికం ఆ బాలికను పాఠశాలకు బదులు పనికి వెళ్లేలా చేసింది. ఆటపాటలతో సరదాగా సాగాల్సిన ఆ బాలిక జీవితం మరో చిన్నారి బాగోగులు చూసే ఆయాగా మార్చింది. అయితే, అదే పని ఆమెకు నిత్యం నరకం చూపించింది. పల్లె నుంచి పట్టణానికి వచ్చిన ఆ బాలికకు పని ప్రదేశంలో వేధింపులే ఎదురయ్యాయి. తనను ఎందుకు హింసిస్తున్నారో తెలియని ఆ బాలిక తిండి కోసం ఇంట్లో చెత్త డబ్బాను ఆశ్రయించాల్సిన దుస్థితికి చేరింది. ఈ విషయం గురించి తెలిసిన సామాజిక కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నరకకూపం నుంచి బయటపడింది. ఇంతటి దారుణమైన ఘటన హరియాణా (Haryana)లోని గురుగ్రామ్(Gurugram)లో చోటుచేసుకుంది.
గురుగ్రామ్కు చెందిన మనీష్ కట్టర్, కమల్జీత్ కౌర్ దంపతులకు మూడున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ చిన్నారి బాగోగులు చూసుకునేందుకు ఐదు నెలల క్రితం ఝార్ఖండ్(Jharkhand)లోని రాంచీ (Ranchi) నుంచి 14 ఏళ్ల బాలికను ఓ ఏజెన్సీ ద్వారా ఇంటి సహాయకురాలి (Domestic Helper)గా నియమించుకున్నారు. పనిలో చేరిన కొద్ది రోజుల తర్వాత బాలిక సరిగా పనిచేయడంలేదని ఆమెను ముఖంపై కొడుతూ, చేతులపై వాతలు పెడుతూ, కత్తితో చేతులపై కోస్తూ వేధించసాగారు. భోజనం కూడా పెట్టక పోవడంతో, ఇంట్లో ఉండే చెత్త డబ్బాలో పడేసిన ఆహారాన్ని తినేదాన్నని బాలిక విచారణలో వెల్లడించింది. కౌర్ దంపతుల చేతిలో బాలిక నరకం అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కౌర్ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసి, బాలికను ఎన్జీవోకు అప్పగించారు. ప్రస్తుతం బాలికకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు దీపికా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత