Crime News: సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ వైరుతో భార్యను హతమార్చిన భర్త

కృష్ణా  జిల్లా తోట్ల వల్లూరులో దారుణం జరిగింది. సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ వైరు బిగించి భార్యను హతమార్చాడు ఓ కిరాతక భర్త.

Published : 26 Aug 2023 22:16 IST

తోట్లవల్లూరు: కృష్ణా జిల్లా తోట్ల వల్లూరులో దారుణం జరిగింది. సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ వైరు బిగించి భార్యను హతమార్చాడు ఓ కిరాతక భర్త. భార్యను హత్య చేసిన అనంతరం తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. కుమ్మమూరుకు చెందిన రమ్యతేజను వీర్ల రామకృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. చెడు వ్యసనాలకు బానిసైప రామకృష్ణ గత కొన్నాళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. గతంలో అల్లుడిపై రమ్యతేజ కుటుంబ సభ్యులు కేసులు సైతం పెట్టారు.  మృతురాలు రమ్యతేజ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తోట్లవల్లూరు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని